ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఫోన్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించడంపై మీ కామెంట్ ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రకటించిన ఆయన.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు గానూ తరగతి గదిలో టీచర్ల ఫోన్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్లాస్ రూంలో టీచర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు వినియోగించరాదని ఆదేశించారు. ఒకవేళ తరగతి గదిలో టీచర్ వద్ద మొబైల్ ఉన్నట్లు రుజువైతే సదరు ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు సైతం సరిగా చదవడం, రాయలేని స్థితిలో ఉన్నారు. దీంతో టీచర్లు క్లాస్ రూంలో ఉన్నప్పుడు కేవలం పిల్లలపైనే దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు జిల్లా అయిన అనంతపురం రైతులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాపై ఫోకస్ చేసిన అధికారులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టి పెట్టారు.

సెల్ఫోన్లపై నిషేధంతో పాటు ప్రతిపాఠశాలలో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్కూల్ పని వేళల్లో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండేలా చూడటంతో పాటు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమ్మీద సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న బృహత్తర నిర్ణయం తీసుకుంది. క్లాస్రూంలో టీచర్లు సెల్ఫోన్ వాడకుండా ఆదేశాలు జారీ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications