ఇండియన్ నేవీ తీపికబురు.. భారీ జీతంతో 1315 ఉద్యోగాలు !
నిరుద్యోగ అభ్యర్థులకు ఇండియన్ నేవీ తీపికబురు ప్రకటించింది. దేశ రక్షణలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. స్కిల్డ్ ట్రేడ్స్మెన్ పోస్టులకు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.63,200 వరకు జీతం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, జీతం వంటి పలు వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

విద్యార్హతలు..
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి (SSC) పాస్ అవ్వాలి. అదనంగా ITI పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్లో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం లభిస్తుంది.
మొత్తం ఖాళీలు..
ఇండియన్ నేవీలో మొత్తం 1315 స్కిల్డ్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాగా స్కిల్డ్ ట్రేడ్స్మెన్ (రెగ్యులర్) 1266 పోస్టులు.. స్కిల్డ్ ట్రేడ్స్మెన్ (బ్యాక్లాగ్) 49 పోస్టులు ఈ మేరకు భర్తీ చేయనున్నారు.
జీతం..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. అంతే కాకుండా అదనంగా ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పెన్షన్, మెడికల్, ట్రావెల్ అలవెన్స్, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి.
వయస్సు..
- కనీస వయస్సు: 18 ఏళ్లు
- గరిష్ట వయస్సు: 25 ఏళ్లు
- OBCలకు 3 ఏళ్ల సడలింపు
- SC/STలకు 5 ఏళ్ల సడలింపు
- దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు
దరఖాస్తు గడువు..
2025 ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2, 2025
దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ https://indiannavy.gov.in/ ను సందర్శించి నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనలు ఫాలో అనుసరించాలి. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ట్రేడ్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. ట్రేడ్ టెస్ట్లో ప్రాక్టికల్ నైపుణ్యాలను అంచనా వేస్తారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications