AP SSC Exams 2025:టెన్త్ పరీక్షల అభ్యర్ధులకు విద్యామంత్రి లోకేష్ సూచనలు..!
ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఇంగ్లీష్ మీడియంలో 5.64 లక్షల మంది విద్యార్ధులు, తెలుగు మీడియంలో 51 వేల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకూ ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు ఉంటాయి.
ఈసారి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు విద్యాశాఖ మంత్రి ఎక్స్ ద్వారా ఓ మెసేజ్ పంపారు. ఇందులో ఆయన పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని విద్యార్ధులకు మంత్రి లోకేష్ సూచించారు.

ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది అని లోకేష్ వారికి తెలిపారు. ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చివర్లో విజయీభవ అంటూ తన మెసేజ్ ను లోకేష్ ముగించారు.
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది.…
— Lokesh Nara (@naralokesh) March 16, 2025
ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షలకు మొత్తం 6.49 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. వీరికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే పరీక్షకు వెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణం అనుమతిస్తారు. మొత్తం 3450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసే అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు 0866-2974540 హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులో ఉంచారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications