ఏపీలోని పోలీసు నియామక మండలి గుడ్ న్యూస్..!
ఏపీలోని రాష్ట్ర పోలీసు నియామక మండలి (AP SLPRB) తాజాగా మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు, విధానం..
పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్ కుమార్ మీనా వివరాల ప్రకారం, రాత పరీక్ష అక్టోబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.

పేపర్ 1 (ఆబ్జెక్టివ్ టైప్) - ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
పేపర్ 2 (డిస్క్రిప్టివ్ టైప్) - మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు
పరీక్ష రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని పలు పరీక్షా కేంద్రాలలో జరగనుంది.
అర్హతలు..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు అయి ఉండాలి.
కనీసం 3 సంవత్సరాల క్రిమినల్ లా ప్రాక్టీస్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు..
OC/BC అభ్యర్థులు - ₹600
SC/ST అభ్యర్థులు - ₹300
ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
సిలబస్ & పరీక్షా విధానం..
పేపర్ 1 - క్రిమినల్ లా, CPC, IPC, Evidence Act వంటి సబ్జెక్టులపై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు.
పేపర్ 2 - లా కేసులపై డిస్క్రిప్టివ్ ప్రశ్నలు, లీగల్ డ్రాఫ్టింగ్, కేస్ అనాలిసిస్ మొదలైనవి.
దరఖాస్తు, సిలబస్, అర్హత ప్రమాణాలు, పరీక్షా కేంద్రాల జాబితా వంటి పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ slprb.ap.gov.in లో చూడవచ్చు. అంతే కాకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పరీక్షకు హాజరయ్యే సమయంలో అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. ఏవైనా తప్పుడు సమాచారం అందించినట్లయితే, అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేస్తారు.












Click it and Unblock the Notifications