JEE మెయిన్ 2026 ఆన్సర్ కీ విడుదల. ఫిబ్రవరి 6 వరకు గడువు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 పేపర్-1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ (JEE Main 2026 Session 1) ని బుధవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు తాత్కాలిక ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొవిజనల్ కీ ద్వారా అభ్యర్థులు తమ జవాబులను సరిచూసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేసేందుకు NTA గడువు ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఒక్కో ప్రశ్నకు ₹200 (నాన్-రిఫండబుల్) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు అధికారిక లింక్ ద్వారా సమర్పించిన అభ్యంతరాలనే పరిగణనలోకి తీసుకుంటామని NTA స్పష్టం చేసింది.

JEE మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 21 నుంచి 29, 2026 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. పేపర్-1 పరీక్షలు మొదటి నాలుగు రోజులు రెండు షిఫ్టుల్లో జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్గా పరీక్ష నిర్వహించారు. పేపర్-2 పరీక్షలు చివరి రోజున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒకే షిఫ్ట్లో నిర్వహించారు.
ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆన్సర్ కీ ని తనిఖీ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా jeemain.nta.nic.in వెబ్సైట్ను సందర్శించాలి. హోమ్పేజీలో కనిపించే "JEE Main Answer Key 2026" లింక్పై క్లిక్ చేసి, తమ అప్లికేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ లేదా జనన తేదీతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే ఆన్సర్ కీ స్క్రీన్పై ప్రదర్శించబడుతుంది. భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరం తెలపాలనుకునే అభ్యర్థులు లాగిన్ అయిన తర్వాత, సంబంధిత ప్రశ్నను ఎంచుకుని దానికి మద్దతుగా అవసరమైన ఆధారాలను అప్లోడ్ చేయాలి. ప్రతి ప్రశ్నకు ₹200 ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యంతరం సమర్పించిన అనంతరం వచ్చే కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలని NTA సూచించింది.
కీ ఆధారంగానే మార్కులు..
అభ్యర్థులు సమర్పించిన అన్ని అభ్యంతరాలను నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ పరిశీలన పూర్తైన తర్వాత, తుది ఆన్సర్ కీని NTA అధికారికంగా విడుదల చేస్తుంది. ఈ తుది కీ ఆధారంగానే అభ్యర్థుల మార్కులు లెక్కించబడతాయి. JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
JEE మెయిన్ పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహించబడుతుంది. పేపర్-1 (B.E./B.Tech) ద్వారా NITలు, IIITలు, కేంద్ర నిధులతో నడిచే సంస్థలు (CFTIలు) మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇదే పరీక్ష IITల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్కు అర్హతా పరీక్షగా కూడా ఉపయోగపడుతుంది.
రా మార్కులను NTA స్కోర్లుగా..
పేపర్-2లో B.Arch మరియు B.Planning కోర్సుల కోసం పరీక్ష నిర్వహించబడుతుంది. పేపర్-1 పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)గా ఉండగా, పేపర్-2Aలో డ్రాయింగ్ టెస్ట్ను పెన్-పేపర్ మోడ్లో నిర్వహించారు. మల్టీ-షిఫ్ట్లలో జరిగిన పరీక్షల కారణంగా అభ్యర్థుల రా మార్కులను NTA స్కోర్లుగా మారుస్తారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీకి విడిగా మరియు మొత్తం స్కోర్గా ఫలితాలు ప్రకటిస్తారు.
మొత్తంగా, ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలతో JEE మెయిన్ 2026 సెషన్-1లో కీలక దశ పూర్తైంది. ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అభ్యంతరాల గడువు, తుది ఆన్సర్ కీ మరియు ఫలితాలపైనే కేంద్రీకృతమైంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications