NACSలో సైబర్ సెక్యూరిటీ కోర్సులు...వెంటనే అప్లయ్ చేయండి: అర్హతలు ఇవే...!
హైదరాబాదు: హైదరాబాదులోని నేషనల్ అకాడెమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సెక్యూరిటీ కోర్సును అభ్యసించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుచున్నది. ఈ కోర్సును అభ్యసించేందుకు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శఇటీ నుంచి 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్, పీజీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అర్హతలు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి.
ఇక నేషనల్ అకాడెమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థలో సెబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లో పోస్టు డిప్లొమా, సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేట్ కోర్సులను అందిస్తోంది. ఇక ఎస్సీ ఎస్సీ ఓబీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు ఫీజులో 60శాతం రాయితీ కల్పిస్తోంది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ.

సెబర్ సెక్యూరిటీలో కోర్సును విజయవంతంగా పూర్తి చేశాక అభ్యర్థులకు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్టు, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్, సిస్టం సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్స్, సెక్యూరిటీ అసలిస్ట్స్, ఇంట్రూషన్ డిటెక్షన్ స్పెషలిస్టు, కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాండర్స్, క్రిప్టాలజిస్టులు, వల్నరబిలిటీ యాసెసర్స్, ట్రైనర్/ విద్యాసంస్థలో టీచర్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలున్నాయి.
ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. వెంటనే www.nacsindia.org అనే ఈ వెబ్సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 27 జూన్ 2021. ఇక మిగతా వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్ 7893141797ను సంప్రదించండి.












Click it and Unblock the Notifications