RRB: ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్..9000 పోస్టులు..
నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్తను అందించింది. ఈ మధ్యకాలంలో రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ఆర్ఆర్బీ గుడ్న్యూస్ చెప్పింది. తొమ్మిదివేల టెక్నీషియన్ పోస్టులకు పట్నారైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ - I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ - III పోస్టులను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుంది. టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు చివరి తేది ఏప్రిల్ 8గా నిర్ణయించడమైనది. ఈ క్రమంలో రిక్రూట్మెంట్ షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ప్రకటించింది. పూర్తివివరాల కోసం అభ్యర్థులు https://indianrailways.gov.in/ లేదా https://www.rrbpatna.gov.in/ వెబ్సైట్లను సంప్రదించగలరు.
ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు మాత్రం 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 ఉంటుంది. సీబీటీ-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఆర్ఆర్బీ టెక్నిషీయన్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

వేతన వివరాలు : ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు ఎంపీకయిన వారికి ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది. గ్రేడ్లను బట్టి వేతనాలు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన టెక్నీషియన్ గ్రేడ్-1 అభ్యర్థులకు నెలకు రూ.29,200 ఉంటుంది. ఇక, టెక్నీషియన్ గ్రేడ్-3 అభ్యర్థులకు మాత్రం నెలకు రూ.19,900 వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలను అక్టోబర్/ డిసెంబర్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వచ్చే ఏడాది ఫిబ్రవరిలోచేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications