నెలకు రూ.లక్షా ముప్పైవేల జీతం. ఇప్పుడే రిలీజైన జాబ్ నోటిఫికేషన్
తెలంగాణలో మరో జాబ్ నోటిపికేషన్ విడుదలైంది. రూ.1.44 లక్షల భారీ జీతంలో ఈ నోటఫికేషన్ విడుదల చేశారు. 2025 సెప్టెంబర్ నెలలో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో 140 మంది బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ నోటిఫికిషన్ అప్పుడే వెలువడాల్సి ఉన్నా.. నాలుగు నెలలు ఆలస్యైంది. నూతన సంవత్సరం నేపధ్యంలో నేడు ఈ ప్రకటన విడుదలైంది.
కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో 79 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్ భగవాన్ తెలిపారు. ఇందులోనే వ్యవసాయ ఎకనామిక్స్, ఇంజినీరింగ్, విస్తరణ, అగ్రానమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్ పిజియాలజీ, ఎంటమాలజీ, ఫ్లోరికల్చర్, ఫ్రూట్ సైన్స్, జీపీబీఆర్, మైక్రోబయాలజీ, ప్లాంట్ పాథాలజీ, పీఎస్ఎంఏ, వెసిటబుల్ సైన్స్ వంటి 16 విభాగాలో సహాయ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
ఈ నెల 31 సా.4 గంటల వరకు యూనివర్సిటీలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రొఫెసర్కు రూ.1.44L-2.18L, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1.31L-2.17L జీతంగా పేర్కొంది. అర్హత వివరాలు చూస్తే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎమ్మెస్సీలో 55% మార్కులు సాధించి, పీహెచ్డీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3 వేల రుసుం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.2 వేల రుసుం చెల్లించాలి

ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి https://skltghu.ac.in/notification/notification-for-recruitment-of-associate-professors-and-professors-in-the-university-through-direct-recruitment/
అలాగే అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ https://skltghu.ac.in/ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications