Telangana SSC Exams: పదో తరగతి అభ్యర్ధులకు గుడ్ న్యూస్-ఆ రూల్ స్ధానంలో మరో ఊరట..!
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లూ పరీక్షలు రాసేందుకు హాజరయ్యే విద్యార్ధులకు ఉన్న ఓ నిబంధనను ఎత్తేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని స్ధానంలో మరో ఊరట కల్పించింది. దీంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్ధులకు ఊరట కలగబోతోంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఇప్పటివరకూ తెలంగాణలో పదో తరగతి రాసే విద్యార్దులకు అమల్లో ఉన్న ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ప్రభుత్వం ఈసారి ఎత్తేసింది. ఈసారి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు నిర్ణీత సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఈ ఒక్క నిమిషం స్దానంలో ఐదు నిమిషాల పాటు గ్రేస్ టైమ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈసారి పదో తరగతి రాసే విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విషయంలో అక్కడక్కడా ఆలస్యం జరుగుతుండటంతో ఒక్క నిమిషం నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. పరీక్ష రాసే విద్యార్ధుల్లోనూ దీనిపై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క నిమిషానికి బదులు ఐదు నిమిషాల పాటు ఊరట కల్పించింది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులకు 9.35 వరకూ పరీక్ష హాల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications