ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది యంగ్ బ్యూటీ "శ్రీదేవి". కోర్టు మూవీలో జాబిలి పాత్రలో నటించి.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ లెవల్లో ఫేమ్ సంపాదించుకుంది. దాంతో యూత్ నుంచి సోషల్ మీడియాలో వరకూ ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రోషన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. కాగా హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ 'బ్యాండ్ మేళం' అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది.
సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, అలాగే మాస్ పెప్పీ సాంగ్ 'తిప్పూ కుంటున్నావ్', మెలోడీ సాంగ్ 'పల్లెలోని సందల్లన్ని మీవే' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. గ్రామీణ నేపథ్యం, ప్రేమ కథ, వినోదం కలిసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు Sai Kumar కీలక పాత్ర పోషిస్తుండగా.. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం కూడా చిత్రబృందం ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.
అందులో భాగంగా యాంకర్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ ముగ్గురిలో ఎవరు పవర్ హౌస్ అని ప్రశ్నించగా.. శ్రీదేవి ఎన్టీఆర్ అంటూ సమాధానం ఇచ్చింది. ఆయనను చూస్తేనే సింహాన్ని చూసినట్టు ఉంటుందని చెప్పుకొచ్చింది. రోషన్ సైతం ఎన్టీఆర్ గురించే చెప్పడంతో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం శ్రీదేవి చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. 'హైకూ' అనే మరో సినిమాతో కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'కోర్ట్' సినిమాతో హిట్ జోడీగా గుర్తింపు పొందిన హర్ష్ రోషన్ - శ్రీదేవి అపల్ల జంట 'బ్యాండ్ మేళం' ద్వారా మరోసారి ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!












Click it and Unblock the Notifications