దువ్వాడ శ్రీనివాస్ గారు..ఇదే మంచి టైం మీ భార్యతో కలిసిపోండి..!
బిగ్బాస్ తెలుగు సీజన్ 9.. ఊహించని మలుపులు, రసవత్తరమైన సన్నివేశాలతో రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తర్వాత హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన వారిలో, బిగ్బాస్ 2.0 తీసుకువస్తానంటూ అడుగుపెట్టిన దివ్వెల మాధురి హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది.
38వ రోజు ఎపిసోడ్ చూస్తే, షో పూర్తిగా మాధురి వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా మారిపోయింది. కంటెంట్ కోసం మాధురి చేస్తున్న దూకుడు, అరుపులు, వ్యక్తిగత విమర్శలు నెక్స్ట్ లెవెల్కి చేరడంతో హౌస్మేట్స్ మరియు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ గొడవ ముగియకముందే, కిచెన్లో ఫుడ్ మానిటర్ దివ్య నిఖితతో మాధురి మరో భారీ వివాదానికి దిగింది. నిఖిత పర్మిషన్ లేకుండా ప్లేట్లో కర్రీ వేసుకున్నందుకు ఆమె ప్రశ్నించగా, మాధురి ఏకంగా కెప్టెన్తో ఫుడ్ మానిటర్ను మార్చాలని డిమాండ్ చేసింది.
ఈ వాదనలో మాధురి చేసిన విమర్శలు మరింత చర్చనీయాంశమయ్యాయి. నాకు అస్సలు అవసరం లేదమ్మా. మీ బాండింగ్లు నాకెందుకు? వాట్ ఏ జోక్.. మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? అంటూ అరిచిన మాధురి, అనంతరం దివ్య నిఖితను నాన్న, నాన్న అనుకుంటూ... అంటూ వెక్కిరించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అంటూ పక్కనే ఉన్న తనూజ వైపు చూస్తూ పరోక్షంగా బాండింగ్స్ను విమర్శించడం, కేవలం కంటెంట్ కోసమే మాధురి ఈ విధంగా ఆడుతోందనే విమర్శలకు బలం చేకూర్చింది.
దివ్వెల మాధురి దూకుడును హౌస్మేట్స్ మెంటల్ గాళ్లు అనుకుంటా.. కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు ఉందని బహిరంగంగా విమర్శిస్తుండగా, ప్రేక్షకులు,నెటిజన్లు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాధురిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాధురి చేస్తున్నది గేమ్ కాదు, శుద్ధ ఓవరాక్షన్. బిగ్ బాస్ 2.0 కాదు, బిగ్ బాస్ 0.2 లా ఆడుతోంది. అరుపులు, వెక్కిరింపులు తప్ప కంటెంట్ ఏముందని కొందరు విమర్శిస్తున్నారు.
ఒకే రోజు రెండు పెద్ద గొడవలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ను నాశనం చేస్తున్నాయి. కేవలం బిగ్గరగా అరవడమే గేమ్ అనుకుంటే ఎలా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.సంజన , దివ్య నిఖితతో మాధురి చేసింది వ్యక్తిగత దూషణ. ఫుడ్ , డిసిప్లిన్ విషయంలో ఇంత అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం ఉందా? ఓవరాక్షన్ ఆపేయండంటూ బిగ్ బాస్కు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
మరికొందరు ఏకంగా ఇదే సరైన సమయం మీ భార్య, పిల్లలతో కలిసిపోండి అంటూ దువ్వాడ శ్రీనివాస్కు హితవు పలుకుతున్నారు. మొత్తం మీద, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి తన ఆటతీరుతో హౌస్లో గ్బాస్ 2.0 తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నస్తోంది. అయితే, ఆమె దూకుడు , వ్యక్తిగత విమర్శలు గేమ్ కంటే డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ వైల్డ్ కార్డ్ ఫైర్, హౌస్మేట్స్ , ప్రేక్షకుల నుంచి ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొంటుందో చూడాలి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications