చిన్న సినిమాకు మద్దతుగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి
సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "శ్రీమద్ భాగవతం పార్ట్-1" చిత్రం షూటింగ్ జూలై 14, 2025న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే ఒక ప్రత్యేకమైన చలనచిత్ర నగరం అని, అది తెలంగాణలో ఉండటం గర్వకారణమని అన్నారు. "శ్రీమద్ భాగవతం" వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలతో కూడిన సినిమాలు ప్రస్తుత తరానికి చాలా అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
1987లో రామానంద్ సాగర్ రూపొందించిన 'రామాయణం' సీరియల్ ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో, అలాగే 'శ్రీమద్ భాగవతం పార్ట్-1' కూడా అంతే విజయం సాధించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని, 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ రంగానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్ట్లో అంతర్జాతీయ స్థాయి నిపుణులు భాగమయ్యారు. 'లైఫ్ ఆఫ్ పై', 'హ్యారీ పాటర్', 'ది జంగిల్ బుక్', మార్వెల్ చిత్రాలకు పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్లైడ్ ఎడ్వర్డ్స్, అలాగే 'మిషన్: ఇంపాజిబుల్', 'స్టార్ ట్రెక్' వంటి చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జోయెల్ షాఫెర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. డాక్టర్ రామానంద్ సాగర్, శ్రీమతి లీలా సాగర్ స్మారకార్థం అంకితం చేయబడిన ఈ చిత్రం, నాలుగు సంవత్సరాలకు పైగా సంస్కృత పరిశోధనతో, 'రామాయణం' సీరియల్కు పనిచేసిన బృందంతోనే రూపొందుతోంది. IMAX-సర్టిఫైడ్ కెమెరాలతో, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026లో బహుళ భాషల్లో విడుదల కానుంది. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే ఈ చిత్రం లక్ష్యం.












Click it and Unblock the Notifications