సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..?
'ధురంధర్ 2: ద రివెంజ్' సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. ఉగాది కానుకగా మార్చి 19 రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ పార్ట్ 1 కు కొనసాగింపుగా ఈ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ గతేడాది డిసెంబర్ లో రిలీజై బాక్సాఫీస్ వద్ద రూ. 1350 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన పార్ట్ 2 రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మరోసారి విధ్వంసం సృష్టిస్తోంది.
అయితే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరుగాంచిన రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణెల మధ్య ఏం జరుగుతున్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు తన భర్త రణ్ వీర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మరోవైపు దీపికా పదుకొణె మాత్రం సైలెంట్ గా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా రణ్ వీర్ సింగ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ కు దీపిక హాజరుకాకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆ తర్వాతి రోజే ఆమె తన అత్తమామలతో కలిసి ముంబైలో ఒక ప్రైవేట్ కాన్సెర్ట్ లో కనిపించింది. దాంతో దీపికను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సొంత భర్త సినిమా ఫంక్షన్ కు రాని దీపిక.. ఆ తర్వాతి రోజు బయటి ఈవెంట్స్ లో కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది.. అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధురంధర్ పార్ట్ 1 మూవీ రిలీజ్ అయినప్పుడు.. ఇప్పుడు వారి మధ్య సఖ్యత లేదు అన్నది స్పష్టం అవుతోంది.

ఇక గతేడాది డిసెంబర్ లో ధురంధర్ పార్ట్ 1 విడుదలైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 1350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ రిలీజ్ సమయంలో రణ్ వీర్ సింగ్ యాక్టింగ్ ను ఆకాశానికి ఎత్తుతూ దీపిక వరుస పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. కానీ పార్ట్ 2 రిలీజ్ అయి మూడు రోజులు గడుస్తున్నా.. ఆమె నుంచి కనీసం ఓ చిన్న పోస్టు కూడా రాకపోవడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications