"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి"
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం 'ధురంధర్: ది రివెంజ్' సినిమా పేరు మారుమోగుతోంది. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో గతంలో విడుదలైన 'ధురంధర్' సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ. 248 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీ ఒక్క హిందీ వెర్షన్ లోనే రూ. 99 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం.
ధురంధర్-2 మూవీ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ కలెక్షన్స్ పరంగా భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త నెంబర్స్ ను నమోదు చేస్తోంది. గతేడాది డిసెంబర్ లో ధురంధర్ మొదటి భాగం రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు తాజాగా ధురంధర్ ది రివెంజ్ మూవీ రిలీజైంది. పార్ట్ 1 కు మించిన రికార్డ్స్ నమోదవుతాయని తెలుస్తోంది.
అయితే ఈ మూవీలో పాకిస్థాన్ లో భారత ఏజెంట్ల గూఢచర్యాన్ని చూపించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఇప్పుడు మన దేశంలోని రెండు ప్రధాన పార్టీలు.. అలాగే మరికొన్ని ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో దేశభక్తి, పాకిస్థాన్ కుట్రలు, మాఫియా, ఉగ్రవాద చర్యలు కనిపిస్తున్నాయి. అయితే మరికొన్ని పార్టీలు మాత్రం ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ మేరకు కాంగ్రెస్, సమాజ్వాది ఎంపీలు ఇమ్రాన్ మసూద్, రషీద్ అల్వీ, తారిక్ అన్వర్ సినిమాను బీజేపీ ఎజెండాతో రూపొందించారని.. ఇది మతతత్వ ద్వేషాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఈ సినిమా 'సమాజాన్ని విడదీయడానికి ఉపయోగపడుతోంది. యువతకు తగని హింస' అని రాజేశ్ రాథోడ్, అసిత్ నాథ్ తివారీలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications