బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హీరో రానా..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలు ప్రముఖులను విచారించింది ఈడీ. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీనటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు.
రానా ప్రమోట్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా తీసుకున్న పారితోషికం.. కమీషన్లు, అలాగే మనీలాండరింగ్ కోణంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. యాప్ల ప్రచారం ద్వారా అందుకున్న ఆర్ధిక లాభాల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, డిజిటల్ ఫుట్ప్రింట్లు, ఐటీ రిపోర్టులు తదితర ఆధారాలపై ఈడీ మానిటరింగ్ కొనసాగుతోంది.

ఈ కేసులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్ విచారణకు హాజరయ్యారు. ఇక ఈ నెల 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
అంతకు ముందు విజయ్ మాట్లాడుతూ.. రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, బెట్టింగ్ యాప్స్ వేరు అని చెప్పారు. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, మన ఒలంపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లకు స్పాన్సర్స్ చేస్తుంటాయన్నారు. తాను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్ కు అని వెల్లడించారు. అది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ అని.. ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందించానని చెప్పారు.
మరోవైపు కేంద్రం ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించినప్పటికీ, ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు ఆ యాప్స్కు ప్రచారం చేశారు? అని ప్రధానంగా ఈడీ అధికారులు విచారణ జరుగుతుంది. ఈ కేసు టాలీవుడ్తో పాటు పలు ఇతర భాషల సినీ పరిశ్రమలకూ విస్తరించవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొన్ని డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు, యూట్యూబ్ చానెళ్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల సమాచారం సేకరించారు ఈడీ అధికారులు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications