అప్పుడు సంతూర్ మమ్మీ.. ఇప్పుడు నేషనల్ క్రష్.. ఎవరా బ్యూటీ ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రైడే చాలు సార్.. కెరీర్ మారిపోవడానికి అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ విషయం అక్షరాల నిజం అని ఒప్పుకోవాల్సిందే. ఒక్క హిట్ తో స్టార్లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. అదృష్టం కూడా కలిసొచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆమె కెరీర్ లో సైతం ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చారని తెలిసి సర్వత్రా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆ బ్యూటీ.. ఒకప్పుడు సంతూర్ మమ్మీగా గుర్తింపు పొంది.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ " త్రిప్తి డిమ్రి ". సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' సినిమాతో త్రిప్తి డిమ్రి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినప్పటికి.. ఈ ఒక్క చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. 'యానిమల్' సీక్వెల్ గా రూపొందనున్న 'యానిమల్ పార్క్' మూవీలోనూ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా కంటిన్యూ అవ్వనుంది. అంతే కాకుండా రీసెంట్ గానే సందీప్ - ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న "స్పిరిట్" చిత్రంలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది.

కుటుంబ నేపథ్యం..
త్రిప్తి డిమ్రికి నటనపై ఆసక్తి పెరగడానికి కారణం ఆమె తండ్రి దినేష్ డిమ్రి అని చెప్పొచ్చు. ఆయన రామ్లీలా ఉత్సవాల్లో పౌరాణిక పాత్రలు పోషించేవారని.. ఆ రకంగా తండ్రిని చూస్తూ త్రిప్తి డిమ్రి కూడా నటి కావాలని ఈ రంగం వైపు అడుగులు వేసింది.
యాడ్స్ ద్వారా గుర్తింపు..
కెరీర్ ప్రారంభంలో పలు కమర్షియల్ యాడ్స్లో కనిపించింది ఈ ముద్దగుమ్మ. ముఖ్యంగా సంతూర్ యాడ్లో "సంతోర్ మమ్మీ"గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే గుడ్ ఎర్త్, పాండ్స్, హిమాలయ వంటి పలు బ్రాండ్ల ప్రకటనల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించింది.
సినిమా కెరీర్..
త్రిప్తి డిమ్రి.. 2017లో Poster Boys అనే కామెడీ సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. అదే ఏడాదిలోనే Laila Majnu అనే ప్రేమకథా చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడకపోయినా, తృప్తికి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత 2019లో నెట్ఫ్లిక్స్ లో విడుదలైన Bullbul అనే మిస్టరీ డ్రామా ఆమెకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చింది. 2022లో వచ్చిన Qala అనే నెట్ఫ్లిక్స్ మ్యూజికల్ డ్రామాకు సైతం మంచి ఆదరణ లభించింది. ఇక యానిమల్ చిత్రంతో ఈ అమ్మడి దశ తిరిగింది.
దీంతో ఇప్పుడు సంతూర్ మమ్మీ నుంచి నేషనల్ క్రష్ అయ్యిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..? -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
"ధురంధర్ 2" ట్రైలర్ రిలీజ్.. రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ పక్కా !! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్కు ‘శ్రీరామరక్ష’












Click it and Unblock the Notifications