మహేష్ బాబు మేనకోడలు దెబ్బకి సోషల్ మీడియా షేక్.. పిక్స్ వైరల్ !!

తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన నటన, ప్రయోగాత్మక చిత్రాలు, సాహసోపేతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ తరహా కథలు, సాంకేతిక ప్రయోగాలతో తెలుగు సినీ రంగానికి కొత్త దారులు చూపించారు. అనంతరం ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

కాగా ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు కూడా వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సోదరి, నటి-నిర్మాత మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్.. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. రీసెంట్ గానే ఈ విషయాన్ని మంజుల అధికారికంగా ప్రకటించారు. జాన్వీ 2018లో విడుదలైన 'మనసుకు నచ్చింది' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించగా, సందీప్ కిషన్ హీరోగా నటించారు.

janhvi-swaroop-latest-photos-goes-full-viral-on-social-media-who-is-niece-of-superstar-mahesh-babu

ప్రస్తుతం జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. లైట్ ఎల్లో కలర్ క్రాప్ ట్యాంక్ టాప్, ఎమరాల్డ్ గ్రీన్ జోగర్ ప్యాంట్ ధరించి ట్రెండీ లుక్‌లో కనిపించిన ఆమె, సహజమైన అందంతో నెటిజన్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె టాప్‌పై ఉన్న "Out Of My Mind... Please Leave A Message" అనే క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రేమికులు "హీరోయిన్ మెటీరియల్", "స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది", "మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వస్తోంది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి క్రేజ్

ఇక సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో జాన్వీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఫ్యాషన్ ఫొటోషూట్లు, ట్రావెల్ పిక్స్, లైఫ్‌స్టైల్ పోస్టులు షేర్ చేస్తూ యువతలో మంచి గుర్తింపు సంపాదిస్తోంది. ఆమె స్టైలింగ్, ఫ్యాషన్ సెన్స్, నేచురల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఎంట్రీకి ముందే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడటం ఆమెకు అదనపు బలంగా మారింది.

మరోవైపు ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం సినీ రంగంలోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని పలు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. మరోవైపు మహేష్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. చిన్నప్పుడే 'వన్... నేనొక్కడినే' చిత్రంలో కనిపించిన గౌతమ్ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

అలాగే దివంగత రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ కూడా హీరోగా పరిచయం కానున్నాడు. ఆయన నటించిన 'శ్రీనివాస మంగాపురం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు వీరితో పాటు జాన్వీ స్వరూప్ కూడా హీరోయిన్‌గా రంగప్రవేశం చేయడంతో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త తరం ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ తొలి సినిమా ఎవరితో, ఏ బ్యానర్‌లో, ఏ దర్శకుడి చేతుల్లో తెరకెక్కనుందనే అంశంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+