నారా లోకేష్ గొప్ప మనసు.. ఎన్టీఆర్ హీరోయిన్ ప్రశంసలు..!
ఏపీ విద్య, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. SMA టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ ఆపద్భాంధవుడిలా అండగా నిలిచారు. పునర్విక వైద్యానికి రూ. 16 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే విరాళాల ద్వారా ఇప్పటికే రూ. 10 కోట్లు వచ్చాయి. అయితే మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తనదేనని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. దీంతో లోకేష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇందులో భాగంగానే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. 'మానవత్వం ఇంకా బతికేఉంది.. నిజంగా ఇది ప్రశంసనీయమైనది'.. అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ గతంలో ఎన్టీఆర్ తో 'దేవర'చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తంగం క్యారెక్టర్ తో అలరించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తోంది.
Humanity is still alive… Truly appreciated @naralokesh👏 https://t.co/PdNehXROnF
— Jahnavi Kapoor (@JahnviKapoor_FC) February 26, 2026
ఇక కర్నూలు జిల్లాకు చెందిన బాలిక పునర్విక.. SMA టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి పిల్లల కండరాలను బలహీన పరుస్తుంది. చిన్నారి చికిత్సకు రూ.16 కోట్లు అవసరం. అయితే ఇప్పటి వరకు ప్రజలు విరాళాలు సేకరించడం ద్వారా రూ.10 కోట్లు వచ్చింది. ఇంకా మరో రూ.6 కోట్లు అవసరం. అయితే రూ. 6 కోట్ల రూపాయలపై మంత్రి నారా లోకేష్ కీలక ట్వీట్ చేశారు. ఆ మొత్తం అందేలా చూసే బాధ్యత తనదేనని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

ఇలాంటి పరిస్థితిలోనూ పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. అయితే ప్రస్తుతం లోకేష్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. లోకేష్ పెద్ద మనసుకు ఫిదా అయ్యారు. 'మానవత్వం ఇంకా బతికే ఉంది.. నిజంగా ఇది ప్రశంసనీయమైనది'.. అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
-
ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
"ధురంధర్ 2" ట్రైలర్ రిలీజ్.. రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ పక్కా !! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!!












Click it and Unblock the Notifications