'వారణాసి' మూవీలో హనుమంతుడిగా మరో స్టార్ హీరో..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి 'వారణాసి' అని తాజాగా టైటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి దాదాపు 4 నిమిషాల గ్లింప్స్ ను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాయి. చివరిలో నందిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు.. త్రిశూలం పట్టుకుని వస్తున్న దృశ్యం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇదే ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. రామాయణం, మహాభారతం అంటే తనకు ఇష్టమని.. మహాభారతం తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా మొదలయ్యే వరకూ తాను రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కిస్తానని అనుకోలేదని రాముడి వేశంలో మహేశ్ బాబు తొలి రోజు సెట్ కు వచ్చినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. అంతేకాక శ్రీరాముడి పాత్రలో మహేశ్ ఉన్న ఫోటోను తన వాల్ పేపర్ కింద పెట్టుకున్నానని తెలిపాడు. మళ్లీ ఎవరైనా చూస్తారేమోనని డిలీట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఈ మూవీలో హనుమంతుడి పాత్రపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మూవీలో హనుమంతుడిగా తమిళ స్టార్ హీరో మాధవన్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే మాధవన్.. ఈ సినిమాలో మహేశ్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడని ఇంత కాలం సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఆయన హనుమంతుడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ మూవీలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తోంది. ఇక మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్.. కుంభ అనే విలన్ పాత్రలో మెరుస్తున్నాడు. ఈ మూవీ 2027 వేసవి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications