పాపం.. మంచు మనోజ్: ఎంత బాధ పెట్టారో గానీ..!!
Manchu Manoj: మచ్ అవైటెడ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్.. భైరవం. ఈ మల్టీస్టారర్ మూవీ ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లీడ్ క్యారెక్టర్లల్లో నటించారు. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె ఆదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, శరత్ లోహితాశ్వ, అజయ్, సందీప్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకుడు. తమిళం సూపర్ హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రమే ట్రైలర్ రిలీజ్ అయింది. రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో వారాహి అమ్మవారి ఆలయం ప్రధానాంశంగా తెరకెక్కింది.

ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసిందీ ట్రైలర్. పైగా మంచు మనోజ్ గానీ, నారా రోహిత్ గానీ సుదీర్ఘ విరామం తరువాత నటిస్తోన్న మూవీ కావడం, వారికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోడు కావడం వల్ల ఓ మంచి హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే అభిప్రాయాలు కలిగించినట్టయింది.
2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు తరువాత మంచు మనోజ్ నటించిన మూవీ ఇదే. మధ్యలో ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019లో కనిపించినప్పటికీ అవి కామియో రోల్స్. పూర్తిస్థాయిలో లీడ్ క్యారెక్టర్ లో కనిపించాడిందులో మంచు మనోజ్. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశాడు
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం ఏలూరులో ఏర్పాటైంది. ఇందులో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీ మీదే కన్నీరు పెట్టుకున్నాడు. ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు.
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప పైనా సెటైర్లు వేశాడు. కుటుంబ సభ్యులకు అన్యాయం చేసి.. శివయ్యను తలచుకుంటే ఆయన రాడని, మనసారా తలచుకుంటే దర్శకుడు, నిర్మాతలు, ప్రేక్షకులు, అభిమానుల రూపంలో వస్తాడని చెప్పాడు. అభిమానుల ప్రేమతో సెకెండ్ ఇన్నింగ్ ఆరంభించానని, నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరాడు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications