సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..గుడ్ బై చెప్పేసిందిగా..!
టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలను చెరిపేసి, కేవలం తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్న నటి సమంత రూత్ ప్రభు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలలో నటించి, ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'జెస్సీ' పాత్రలో ఆమె చూపించిన అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 'దూకుడు', 'ఈగ', 'అత్తారింటికి దారేది' వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. 'మనం', 'రంగస్థలం', 'మజిలీ', 'ఓ బేబీ' వంటి చిత్రాలు ఆమె నటనకు మరో నిదర్శనంగా నిలిచాయి. తమిళంలోనూ 'తేరి', 'మెర్సల్' వంటి పెద్ద చిత్రాలలో భాగమై, తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.

హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత, ఇండస్ట్రీలో ఒక ఆదర్శ జంటగా నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అటు నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోగా, సమంత మాత్రం ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
కొంతకాలం పాటు 'మయసైటీస్' అనే అరుదైన వ్యాధితో బాధపడిన సమంత, సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో ఆమె చూపించిన ధైర్యం, పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుని, మళ్లీ సినిమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్లపై దృష్టి పెట్టి, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
తాజాగా సమంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సినిమాలను తగ్గించేయాలని ఆమె భావిస్తోంది. దీనిపై సమంత మాట్లాడుతూ..గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పిన సమంత, ఇప్పుడు తన జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేశారు.
గతంలో మాదిరిగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండకుండా, తన శరీరం చెప్పే మాట విని, తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా, నాణ్యతలో మాత్రం రాజీ పడనని, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలనే ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications