ఓటీటీలోకి యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
'యాక్షన్ కింగ్' అర్జున్ దర్శకుడిగా మారి, తన కూతురు ఐశ్వర్యా హీరోయిన్ గా తెరకెక్కించిన మూవీ 'సీతా పయనం'.. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదలైంది. అయితే ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి టాక్ అంతగా పాజిటీవ్ రాకపోవడంతో కమర్షియల్గా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ మూవీ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ ఎన్ఎక్స్టీ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
ఇక 'సీతా పయనం' మూవీ తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందు ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ను అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల అతను తప్పుకోవడంతో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది.

ఇక సీతా పయనం మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, సత్యరాజ్, కోవై సరళ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాను రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై అర్జున్ సార్జా స్వీయ నిర్మాణంలో రూపొందించాడు. ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అయినప్పటీ యువతను పెద్దగా అందుకోలేదనే చెప్పాలి. దాంతో బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుందీ మూవీ. ఇక మార్చి 20 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications