విజయ్ 'జన నాయగన్' మూవీకి షాక్..!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. హెచ్. వినోద్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'జన నాయగన్'. ఇది విజయ్ కు చివరి సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన 'ఒరు పేరే వరలారు' (ఒక పేరే చరిత్ర) సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. మిలియన్స్ లో వ్యూస్ తో ఇండియాలో టాప్ సాంగ్ గా ట్రెండింగ్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి మూవీ 'జన నాయగన్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జన నాయగన్ మూవీ ఆడియో ఫంక్షన్ ను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించనుంది చిత్ర యూనిట్.
అయితే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు సంబంధించి మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆడియో ఫంక్షన్ పై కొన్ని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడియో ఫంక్షన్ లో ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలు ఉండకూడదని రూల్ పెట్టినట్లు సమాచారం. కేవలం మూవీ గురించే మాట్లాడాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ చివరి మూవీ కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు చూస్తున్న నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం ఇలా షరతులు విధించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మూవీలో మమితా బైజు, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, మోనిషా బ్లెసీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. మరోవైపు దళపతి విజయ్.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో కరూర్ ఘటన తర్వాత కొద్దిరోజులపాటు ప్రచారం ఆపేసిన విజయ్.. ఇటీవల ఈరోడ్ లో మరోసారి బహిరంగ సభను నిర్వహించారు.












Click it and Unblock the Notifications