ముఖ్యమంత్రిని రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారనే మీకు తెలుసా. అది కూడా ఓ హీరోయిన్ను పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని దాదాపు నాలుగేళ్లు రహస్యంగా మెయిన్టైన్ చేశారంటే అది మమూలు విషయం కాదు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు కర్నాటక మాజీ సీఎం , జేడీఎస్ అధినేత కుమారస్వామి. అదృష్టం కలిసి వచ్చి పరిమిత ఎమ్మెల్యేలతో రెండుసార్లు కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు.
ఇక కుమారస్వామి వైవాహిక జీవితం కూడా ఓ సంచలనమే అని చెప్పాలి. ఆయన కర్నాటక రాజకీయాల్లో ఎంత ఫేమస్ అయ్యారో.. అంతకంటే ఎక్కువుగానే తన పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచారాయన.1986 సంవత్సరంలో అనిత అనే ఆమెను కుమారస్వామి మొదటి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నిఖిల్ గౌడ అనే కొడుకు ఉన్నాడు. అయితే కుమారస్వామి ఎవరికి తెలియకుండా 2006లో రాధిక అనే హీరోయిన్ను రెండో వివాహం చేసుకున్నారు.

రాధిక హీరోయిన్గా చేసే సమయంలో కుమారస్వామి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో రాధికను కుమారస్వామి రెండో వివాహం ఇంట్లో తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. ఈ విషయం 2010లో రాధిక చెప్పే వరకు కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారనే విషయం ఎవరికి తెలియదు.
రెండో వివాహ సమయంలో కుమారస్వామి వయస్సు 47 కాగా, అతని కంటే రాధిక 27 సంవత్సరాలు చిన్నది కావడం విశేషం. కుమారస్వామితో పాటు, రాధికకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన రెండేళ్లకు భర్త రతన్కు హార్ట్ ఎటాక్ వచ్చి కన్నుమూశాడు. దీంతో తరువాత కుమారస్వామితో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు దారి తీసింది. ఇదిలా ఉంటే రాధిక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. తారకరత్న నటించిన భద్రాద్రిరాముడు సినిమాతో పాటు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications