థాయ్ లాండ్ లో రష్మిక, విజయ్ హనీమూన్.. ఫోటో వైరల్..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సినీ నటి రష్మిక పెళ్లి ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ పూర్తయింది. ఇక ప్రస్తుతం ఈ కొత్త జంట తమ హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రస్తుతం థాయ్ లాండ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పచ్చని ప్రకృతి నడుమ ఈ కొత్త జంట ఏకాంతంగా గడుపుతున్నట్లుగా ఉంది. దాంతో ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ జంట థాయ్ లాండ్ తీరంలోని కో సముయి ద్వీపంలో ఉన్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications