తెలంగాణకు సిఎం కారా?

YS Rajasekhar Reddy
తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటన ఒక ప్రాంతీయ నాయకుడు చేసిన ప్రకటనలా ఉందే తప్ప రాష్ట్ర స్థాయి నాయకుడు చేసినట్లుగా లేదు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పాల్గొన్న సమావేశంలోనే ఆయన తన ప్రాంతీయ విద్వేషాన్ని వెళ్లగక్కారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్న మాటలనే చెప్పానని ఆయన సమర్థించుకోవడానికి చూస్తున్నప్పటికీ కర్నూలు జిల్లా నంద్యాల ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన తీరు చూస్తే ఆయన ప్రాంతీయ విభేదాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనం హైదరాబాదుకు విదేశీయులమవుతామని ఆయన అన్న మాటలు పక్కా రాయలసీమ ప్రాంతీయ నాయకుడు మాట్లాడినట్లుగానే ఉన్నాయి.

నిజానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంతటికీ నాయకుడు. మిగతా నాయకులతో తాను ఆ రకంగా వేరు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రాష్ట్రానికంతటికీ ప్రాతినిధ్యం వహించాల్సిన ఆయన రాయలసీమను సొంతం చేసుకుని మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం. మనం అనే పదం వాడడంలోనే ఆయన పక్షపాత ధోరణి అర్థమవుతోంది. రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి మనం అనే పదం వాడాల్సి ఉంటుంది.కానీ ఆయన రాయలసీమ ప్రాంత ప్రజలతో మాత్రమే మమేకవుతున్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే రాజశేఖర రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. తొలి దశ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెసు ఓడిపోతుందా, గెలుస్తుందా అనేది కూడా అంత ముఖ్యం కాదు. ఓట్ల కోసమైనా సరే రాజశేఖర రెడ్డి అలా మాట్లాడడం, ఆ మాటలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల తాత్కాలిక ఇంచార్జీ వాయలార్ రవి సమర్థించడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఉండాలంటే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమైక్యంగా ఉండాలంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉండకూడదంటే అన్ని ప్రాంతాల ప్రజలు సమానమనే భావన అందరి మనస్సులో నాటుకుని పోవాలి. కానీ ఇంత కాలం ఆ భావైక్యత ఏర్పడలేదని ముఖ్యమంత్రి మాటలను బట్టే అర్థమవుతోంది. మనం అనే తెలంగాణేతర ప్రాంతంలోని రాజశేఖర రెడ్డి వంటి నాయకులకే లేకపోతే మిగతా వారి సంగతి చెప్పనవసరం లేదు. నిజానికి, తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డిని ఆదరించారు. ఆ ఆదరణకు రాజశేఖర రెడ్డి చెల్లించిన మూల్యం ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టి, తెలంగాణ ప్రాంత ప్రజలను అవమాన పరచడం.

తెలంగాణపై ఇతర ప్రాంతాల రాజకీయాధిపత్యం ఏ రీతిలో ఉందో రాజశేఖర రెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. ఒక్క రాజకీయాధిపత్యమే కాదు, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యాధిపత్యం తెలంగాణ ప్రజలను అవమానపరిచేవిగానూ, అణచివేసేవిగానూ ఉన్నాయి. ఆ ఆధిపత్యాల ధిక్కరణకు కెసిఆర్ ప్రతినిధి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+