10కె రన్: సినీతారలతో అమ్మాయిల పరుగు
హైదరాబాద్: నగరంలో ఆదివారం జరిగిన 10కె రన్లో వేలాదిమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వరుసగా 11వ ఏట డెక్కన్ క్రానికల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం హుస్సేన్ సాగర్ వద్ద విజయవంతంగా జరిగింది. ఉదయం 5గంటల వరకే క్రీడాభిమానులు, ఔత్సాహికులు భారీ సంఖ్యలో పీపుల్స్ ప్లాజా దగ్గరకు చేరుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ జెండా ఊపి 10కె రన్ను ప్రారంభించారు.
ఆ తర్వాత 7కె రన్ను నటుడు శర్వానంద్, ప్రముఖ క్రీడాకారులు సత్తి గీత, ముఖేష్ ప్రారంభించారు. ప్రారంభించిన గంటలోనే 10కె రన్లో పాల్గొన్న ఎక్కువ మంది యువతీ యువకులు తమ గమ్యాన్ని చేరుకున్నారు. శర్వానంద్ తోపాటు సినీ నటులు రెజీనా, మధుశాలిని ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
పురుషుల విభాగంలో 30నిమిషాల 48 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్న డేవిడ్ కిప్టూ కిప్రోటిక్(కెన్యా) విజేతగా నిలిచాడు. ఎండర్ విడ్ ద్వితీయ స్థానం, యోగేంద్ర తృతీయ స్థానంలో నిలిచారు. మొదటి బహుమతిగా రూ. లక్ష, ద్వితీయ బహుమతి రూ. 70వేలు, తృతీయ బహుమతి 50వేలు అందుకున్నారు. మహిళల విభాగంలో కవితా రాట్ 37 నిమిషాల 20 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో జుహ, స్వామి మూడో స్థానంలో నిలిచారు.

రన్లో యువతులు
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్ సందర్భంగా పరుగుపెడుతున్న యువతులు.

పరుగుపెడుతున్న మహిళ
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్ సందర్భంగా పరుగుపెడుతున్న ఓ మహిళ.

పరుగులో చిన్నారులు
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్ సందర్భంగా పరుగుపెడుతున్న చిన్నారులు.

పతకాలతో విజేతలు
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో తాము సాధించిన పతకాలతో మహిళా విజేతలు.

ఔత్సాహికుల ఆనందం
ఆదివారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తున్న యువతులు.

రన్లో ఔత్సాహికుల పరుగులు
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న సందర్భంగా పరుగులు పెడుతున్న ఔత్సాహికులు.

ఔత్సాహికుల ఆనందం
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. పరుగును అలవాటు చేసుకోవాలని సూచిస్తున్న బ్యానర్తో యువత.

రన్లో ఔత్సాహికుల పరుగులు
ఆదివారం ఉదయం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 10 కె రన్లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్లో పాల్గొన్న సందర్భంగా పరుగులు పెడుతున్న ఔత్సాహికులు.












Click it and Unblock the Notifications