వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓం గం గణపతయేనమః
ఒక సాంస్కృతిక వేదిక స్వరాష్ట్రంలో వాణిజ్య, ఆర్ధికాభివృద్ధి కోసం నడుం బిగించడం మంచి పరిణామం. ఇప్పటివరకు ఈ తరహా సంస్థలన్నీ కేవలం సాంస్కృతిక సంబంధాలకే పరిమితమై పనిచేస్తున్నాయి. ఈ పరిధిని దాటి ఇప్పుడు అర్ధవంతమైన సంబంధాల నిర్మాణంలో పాలుపంచుకోవాలని ప్రవాసుల సంఘాలు ఆశిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంస్కరణలు, అభివృద్ధి పథకాలు ఎన్ఆర్ఐలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని ఈ సదస్సులో పాల్గొన్న ఆటా నేతలు డాక్టర్ సంధ్య గవ్వ, ఆటా మాజీ అధ్యక్షుడు చరణ్రెడ్డి చెప్పారు. స్వరాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా వున్నప్పటికీ అసలేం జరుగుతున్నదీ, తమకు అవకాశాలు ఎక్కడెక్కడ వున్నదీ వారికి తెలియడం లేదని వారు అన్నారు.
Story first published: Saturday, October 4, 2003, 23:53 [IST]