తొలిభారత
యానిమేషన్
చిత్రం
భాగ్మతి
:ది
క్వీన్
ఆఫ్
ఫార్చ్యూన్స్
ప్రేక్షకులముందుకు
రానుంది.
ఈ
నెల
26వ
తేదీనఈ
చిత్రం
విడుదలవుతుంది.
వాస్తవపాత్రలు
యానిమేషన్
చిత్రాలతో
ఇంటరాక్ట్అయ్యే
చిత్రం
ఇది.
గోల్కొండ
రాకుమారుడుకులీ
కుతుబ్
షా,
స్థానికకళావంతురాలు
భాగ్మతి
ప్రేమకథఆధారంగా
ఈ
చిత్రాన్ని
నిర్మించారు.
వాస్తవపాత్రలు
యానిమేషన్
చిత్రాలతోసంభాషిస్తాయి,
పాడుతాయి,
నృత్యాలుచేస్తాయి.
జీ
నెట్వర్క్
నిర్మించిన
ఈ
చిత్రానికిమేజర్
అశోక్
కౌల్
దర్శకత్వంవహించారు.
ఈ
చిత్రంలో
టాబూ,
హేమ
మాలిని,మిలింద్
సోమన్
నటిస్తున్నారు.పురాతత్వశాస్త్ర
విద్యార్థిని
అయిన
టాబూ
కులీ
కుతుబ్షా,
భాగమతి
ప్రేమ
వృత్తాంతంపైఅధ్యయనం
చేయడానికి
గోల్కొండకువస్తుంది.
ఇక్కడ
ఆమెకు
కుతుబ్షాహీ
వారసుడిగా
మిలింద్
సోమన్కనిపిస్తాడు.
ఈ
సందర్భంలో
టాబూఅధ్యయనంలో
కనుగొన్న
అంశాలుయానిమేషన్
దృశ్యాలుగా
మన
కళ్లముందు
కదులాడుతూపోతుంటాయి.ఈచిత్రాన్ని
5
కోట్ల
రూపాయల
వ్యయంతోనిర్మించారు.
భాగ్మతి
పాడుతూ,
నాట్యంచేస్తుంది.
మాచిస్
ఫేమ్
విశాల్భరద్వాజ్
దీనికి
సంగీతంసమకూర్చారు.
ఈ
చిత్రాన్ని
పూర్తిగా
భారతసాంకేతిక
పరిజ్ఞానంతో,
నైపుణ్యాలతోనిర్మించారు.
ఈ
చిత్రనిర్మాణం
కోసం
110
మందిమూడేళ్ల
పాటు
అవిశ్రాంతంగా
కృషిచేశారు.మొత్తం2
గంటల
40
నిమిషాల
నిడివి
గల
సినిమాలో
గంటా
35నిమిషాలు
యానిమేషన్
చిత్రీకరణ.
ఈ
చిత్రంవాల్డ్
డిస్సీ,
స్పీల్బర్గ్ల
నిర్మాణాలకు
ఏమాత్రం
తీసిపోదని
నిర్మాణ
బాధ్యతలుచేపట్టినవారంటున్నారు.
హాలివుడ్స్థాయిలో
దీని
నిర్మాణం
జరిగిందనిఅంటున్నారు.ఈసినిమాను
వివిధ
భాషల్లోప్రపంచవ్యాప్తంగా
విడుదల
చేయడానికిఏర్పాట్లు
జరుగుతున్నాయి.
మొదట
హిందీలోదేశవ్యాప్తంగా
ఈ
నెల
26వ
తేదీనవిడుదల
అవుతుంది.
అంతర్జాతీయంగాహిందీ
వెర్షన్
ఆ
తర్వాత
రెండువారాల
తర్వాతవిడుదలవుతుంది.