మొద్దు శీను భార్యతో మాటామంతీ
తొలిభారత యానిమేషన్ చిత్రం భాగ్మతి :ది క్వీన్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నెల 26వ తేదీనఈ చిత్రం విడుదలవుతుంది. వాస్తవపాత్రలు యానిమేషన్ చిత్రాలతో ఇంటరాక్ట్అయ్యే చిత్రం ఇది. గోల్కొండ రాకుమారుడుకులీ కుతుబ్ షా, స్థానికకళావంతురాలు భాగ్మతి ప్రేమకథఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవపాత్రలు యానిమేషన్ చిత్రాలతోసంభాషిస్తాయి, పాడుతాయి, నృత్యాలుచేస్తాయి. జీ నెట్వర్క్ నిర్మించిన ఈ చిత్రానికిమేజర్ అశోక్ కౌల్ దర్శకత్వంవహించారు. ఈ చిత్రంలో టాబూ, హేమ మాలిని,మిలింద్ సోమన్ నటిస్తున్నారు.పురాతత్వశాస్త్ర విద్యార్థిని అయిన టాబూ కులీ కుతుబ్షా, భాగమతి ప్రేమ వృత్తాంతంపైఅధ్యయనం చేయడానికి గోల్కొండకువస్తుంది. ఇక్కడ ఆమెకు కుతుబ్షాహీ వారసుడిగా మిలింద్ సోమన్కనిపిస్తాడు. ఈ సందర్భంలో టాబూఅధ్యయనంలో కనుగొన్న అంశాలుయానిమేషన్ దృశ్యాలుగా మన కళ్లముందు కదులాడుతూపోతుంటాయి.ఈచిత్రాన్ని 5 కోట్ల రూపాయల వ్యయంతోనిర్మించారు. భాగ్మతి పాడుతూ, నాట్యంచేస్తుంది. మాచిస్ ఫేమ్ విశాల్భరద్వాజ్ దీనికి సంగీతంసమకూర్చారు. ఈ చిత్రాన్ని పూర్తిగా భారతసాంకేతిక పరిజ్ఞానంతో, నైపుణ్యాలతోనిర్మించారు. ఈ చిత్రనిర్మాణం కోసం 110 మందిమూడేళ్ల పాటు అవిశ్రాంతంగా కృషిచేశారు.మొత్తం2 గంటల 40 నిమిషాల నిడివి గల సినిమాలో గంటా 35నిమిషాలు యానిమేషన్ చిత్రీకరణ. ఈ చిత్రంవాల్డ్ డిస్సీ, స్పీల్బర్గ్ల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోదని నిర్మాణ బాధ్యతలుచేపట్టినవారంటున్నారు. హాలివుడ్స్థాయిలో దీని నిర్మాణం జరిగిందనిఅంటున్నారు.ఈసినిమాను వివిధ భాషల్లోప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికిఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట హిందీలోదేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీనవిడుదల అవుతుంది. అంతర్జాతీయంగాహిందీ వెర్షన్ ఆ తర్వాత రెండువారాల తర్వాతవిడుదలవుతుంది.












Click it and Unblock the Notifications
