సంగీత సరస్వతి సరోజా జనార్ధన్
హైదరాబాద్: ఈమె పేరు సరోజా జనార్ధన్ . వర్ధమాన కళాకారిణి నుంచి ఎదిగి ఇప్పుడు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వాంసురాలిగా ఎదిగారు. ఇటీవల రవీంధ్ర భారతిలో ఆమె చేసిన సంగీత కచేరి శ్రోతలను బాగా ఆకట్టుకుంది.
లక్నోలో 1999లో జరిగిన 5వ జాతీయ యువజనోత్సవంలో క్లాసికల్ ఓకల్ విభాగంలో ప్రధమ బహుమతి పొందారు. ఇంకా అనేక ప్రభుత్వ , ప్రైవేటు సంస్ధల ద్వారా అనేక పురస్కారాలను సాధించారు. "భజగోవిందం","శ్రీ లక్ష్మీ నరసింహ కరవాలంబం", "నమో నమో మారుతి" , శ్రీ వీరభద్ర సుప్రభాతం" వంటి ఆల్బమ్స్ ను కంపోజ్ చేశారు. దేశ విదేశాల్లో సుమారు 500 ప్రదర్శనలు ఇచ్చారు.
సరోజా జనార్ధన్ ప్రఖ్యాత సంగీత విధ్వాంసులైన ఎన్ సివి కృష్ణమాచార్యుల వద్ద శిక్షణ పొందారు. నాగార్జున యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్ చేశారు. విదేశాల్లో భారతీయుల కోసం సంగీత కచేరీలు ఇవ్వాలనుకుంటున్న సరోజ గారిని ఈ కింది నెంబర్లలో సంప్రదించవచ్చు.
040-24545365
సెల్: 98490 09743












Click it and Unblock the Notifications