వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ పై కుట్ర ఉత్తదేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఏ విధమైన కుట్ర లేదని సిబిఐ తేల్చేసింది. సిబిఐ దర్యాప్తు నివేదికను జీ 24 గంటలు టీవీ చానెల్ వూర్తి వివరాలతో గురువారం ప్రసారం చేసింది. సిబిఐ దర్యాప్తు జరిగిన తీరును, హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తీరును ఆ చానెల్ ప్రసారం చేసింది. తన తండ్రి మరణం వెనక కుట్ర ఉందని వైయస్ కుమారుడు వైయస్ జగన్ అనుమానాలు వ్యక్తం చేయడంతో సిబిఐ కుట్ర కోణంపై క్షుణ్నంగా దర్యాప్తు చేసింది. ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం - ఓ వైపు షాక్, మరో వైపు హెలికాప్టర్ కంప్రెసివ్ పోర్సు వల్ల వైయస్ తో పాటు పైలట్ భాటియా, కో పైలట్ ఎంఎస్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారి సుబ్రహ్మణ్యం మరణించారు.

వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని గుర్తించిన కో పైలట్ ఎంఎస్ రెడ్డి గో అరౌండ్ అంటూ అరిచిన మాటలు ఎటిసిలో రికార్డు అయ్యాయి. ట్రాన్స్ మిషన్ ఆయిల్ సమస్య తలెత్తిందని, ఆ సమయంలోనే ఆ సమస్యను పరిష్కరించడానికి పైలట్లు ప్రయత్నాలు చేశారు. దాన్ని పరిష్కరించలేకపోయారు. ఆ సమయంలోనే హెలికాప్టర్ నల్లమల అడవుల్లో మబ్బుల్లో చిక్కుకుంది. ఎదురుగా పెద్ద కొండ ఎదురైంది. కొండ నుంచి తప్పించడానికి హెలికాప్టర్ ను పైకి తీసికెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టి కుప్పకూలింది.

వాతావరణం బాగా లేకపోవడం, ట్రాన్స్ మిషన్ ఆయిల్ సమస్యను పరిష్కరించలేకపోవడం వల్లనే హెలికాప్టర్ ప్రమాదం సంభవించినట్లు సిబిఐ తేల్చింది. కుట్ర కోణాన్ని పరిశీలించడానికి సిబిఐ అధికారులు పోన్ కాల్స్ ను, ఎస్ఎంఎస్ లను పరిశీలించారు. బ్యాంక్ ఖాతాలను, ఇ - మెయిల్ బ్యాంక్ ఖాతాలను వారు పరిశీలించారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ఏ విధమైన కాల్స్ గానీ ఎస్ఎంఎస్ లు గానీ రాలేదనీ వెళ్లలేదనీ తేల్చుకున్నారు. డబ్బులు పెద్ద యెత్తున చేతులు మారిన దాఖలు కూడా కనిపించలేదు. దీంతో కుట్ర కోణాన్ని సిబిఐ కొట్టేసింది.

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ హైదరాబాదు నుంచి బయలుదేరి ప్రమాదానికి గురయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే విషయాలను కూడా సిబిఐ సేకరించింది. మధ్యలో ఓసారి హెలికాప్టర్ జాడ శంషాబాద్ విమానాశ్రయానికి అందినట్లు కూడా తేల్చింది. చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాతావరణం అనుకూలించకపోయినా హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రమాదానికి గురై నిరుడు సెప్టెంబర్ 2వ తేదీన దుర్మరణం పాలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X