మోస్ట్ వాంటెడ్ దావూద్ భవనం మోస్ట్ వాంటెడ్
సుమారు 289 నివాసిత భవనాలున్న ఈ బెండీ బజార్ ప్రాంతాన్ని పునరాభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన బుర్హానీ సంస్థ, ఆ ప్రాంత పరిధిలోకి వచ్చే ఉన్న పాక్ మోడియా వీధిని కూడా అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉంది. దావుద్ సోదరుడు ఇక్భాల్ కస్కర్ నివసిస్తున్న ఈ వీధిలో నివసిస్తున్నాడు. ఇక్కడే అతనిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
బెండీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతో పాటు, ఆ ప్రాంతంలో నెలకొన్న దావూద్ మచ్చను కూడా తొలిగించేందుకు బుర్ హానీ సంస్థ తోడ్పడాలని సీనియర్ పాత్రికేయుడు ఎస్.బాలకృష్ణన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో నిఘా వేసి దావూద్ నుంచి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.2వేల కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాంత అభివృద్ధి పనుల ద్వారా 3200 మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు.
జనవరి 2001లో ప్రభుత్వాధికారులు వేసిన దావూద్ ఆస్తుల వేలానికి స్పందన లభించలేదు. ప్రాణ భయంతో ఎవరు ఈ భవనాలను కోనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే అదే ఏడాది సెప్టంబర్ లో దావూద్ కు సంబంధించి 13 ఆస్తులకు సంబంధించిన వేలంలో కేవలం 144 చదరపు గజాల షెడ్ మాత్రమే కోనుగోలు జరిగింది.