ఎపి: స్త్రీలపై రేప్‌లు తక్కువ, వేధింపులు ఎక్కువ

Women
హైదరాబాద్: దేశంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు కూడా చేరిపోయింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహిళలపై జరిగిన అత్యధిక నేరాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో నిరుడు మహిళపై జరిగిన మొత్తం నేరాల్లో 11 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ఎస్ఆర్‌బి) విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

దేశంలో మహిళపై జరిగిన నేరాల్లో పది శాతం హైదరాబాద్, విజయవాడలను కలిపి పదిశాతం జరిగాయి. దేశంలో మహిళలకు భద్రత లేని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైంది. బ్యూరో లెక్కల ప్రకారం - రాష్ట్రంలో 2012లో మహిళలపై జరిగిన నేరాలు 28,171 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌పైన ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో 30,942 కేసులు నమోదయ్యాయి. నగరాలను లెక్కలోకి తీసుకుంటే హైదరాబాదులో 1,899 కేసులు నమోదు కాగా, విజయవాడలో ఒక్కటి తక్కువగా 1,898 కేసులు నమోదయ్యాయి.

ఈ నగరాల కన్నా పైస్థానంలో ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూర్ ఉన్నాయి. మహిళల పట్ల జరిగే నేరాల్లో అత్యాచార నేరాలు తక్కువే ఉన్నాయి. చాలా కేసులు మహిళలను భర్తలు, బంధువులు వేధించినవే. ఈ కేసుల విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. భర్తలు, బంధువులు దాడి చేసిన కేసులు రాష్ట్రంలో 13,389 నమోదు అయ్యాయి. ఈ విషయంలో కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ కన్నా ముందుంది.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 40 శాతం ఉన్నాయి. మహిళలపై దాడి కేసులు పది శాతం ఉన్నాయి. మధ్యప్రదేశ్ మాత్రమే ఈ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఉంది. అక్రమ మనుషుల రవాణా కేసులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువే. ఇటువంటి కేసులు 472 నమోదయ్యాయి. తమిళనాడులో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇటువంటి కేసులు 500 నమోదయ్యాయి. వరకట్నం వేధింపుల కేసులు కూడా రాష్ట్రంలో ఎక్కువే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+