షాక్: 11ఏళ్లలో 50శాతం పెరిగిన డయాబెటీస్ మరణాలు
హైదరాబాద్: డయాబెటీస్ ఇటీవల కాలంలో మనదేశంలో విస్తృతంగా తన ప్రభావాన్ని చూపిస్తున్న ప్రబలమైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారి జీవితం పూర్తిగా మారిపోవాల్సిందే. అంతేకాదు, మనదేశంలో డయాబెటీస్ వ్యాధి సోకిన వారిలో ఎక్కువమంది ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు.
2005-2015 మధ్య కాలంలో 50మంది డయాబెటీస్ కారణంగానే మరణించడం గమనార్హం. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(జీడీబీ) ప్రచురించిన డేటా ప్రకారం.. మరణాలకు దారితీసే వ్యాధుల్లో డయాబెటీస్ది 7వ స్థానంగా ఉంది. 2005లో ఇది 11వ స్థానంలో ఉండేది.
ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తుండటంతో ఆ వ్యాధి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో క్రోనిక్ అబ్ స్ట్రక్టివ్ పాల్మనరీ డిసీజ్, సెరిబ్రోవస్కూలర్ డిసీజ్, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, డియర్హేల్ డిసీజ్, టర్బర్కూలోసిస్ ఉన్నాయి.
2015లో 3,46,000మంది ప్రజలు డయాబెటీస్ వ్యాధి బారిన పడగా, ఇందులో 3.3శాతం మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1990 నుంచి ఈఏడాది 2.7శాతం వార్షిక మరణాల సంఖ్య పెరిగింది. ప్రతీ లక్ష జనాభాలో 26మంది ప్రజలు డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. 2.4శాతం డయాబెటీస్ వ్యాధితో అంగవైకల్యం కూడా కలిగే అవకాశం ఉంది. మరణం నుంచి తప్పించేందుకు వారిని అంగవికలురని చేయాల్సిన పరస్థితి ఏర్పడింది.

భారతదేశంలో సుమారు 69.1మిలియన్ల ప్రజలు డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చైనా(109మిలియన్లు) తర్వాత మనదేశం రెండో స్థానంలో ఉంది. ది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్(ఐడీఎఫ్) 2015లో విడుదల చేసిన డయాబెటీస్ అట్లాస్ ప్రకారం 36మిలియన్ల మంది ప్రజలకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.
20-79ఏళ్ల మధ్య వయస్కుల్లో 9శాతం డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్ వ్యాధి పాంక్రీస్ పై ప్రభావం చూపడంతోపాటు ఇన్సూలిన్ విడుదల చేసి మొత్తం శరీరాన్ని కూడా పాడు చేయగలదు. డయాబెటీస్ కారణంగా.. గుండె సంబంధిత రోగాలు, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపు కోల్పోవడం, న్యూరోపతి, నర్వ్ డ్యామేజీ మొదలగు వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే, ఇతర దేశాల్లో మాత్రం 60ఏళ్లకు పైబడిన వారిలోనే డయాబెటీస్ కనిపిస్తోంది. 40-59ఏళ్లలోపే మనదేశంలోని ప్రజలకు డయాబెటీస్ ఎక్కువగా వస్తోంది. ఇది జనాభా పెరుగుదలపైనా ప్రభావం చూపిస్తోంది.
'ప్రపంచం కంటే ముందే డయాబెటీస్ను మనదేశంలో దాడి చేసింది' అని
ఫోర్టీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ డయాబెటీస్, మెటబాలిక్ డిసీజ్ అండ్ ఎండోకోరినాలజీ, న్యూఢిల్లీ ఛైర్మన్ అనూప్ మిశ్రా తెలిపారు. డయాబెటీస్ ను పారద్రోలవచ్చునని, అందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తీవ్రమైన పని ఒత్తిడి కూడా డయాబెటీస్కు దారితీయవచ్చని తెలిపారు.
డయాబెటీస్
సామాజిక, జన్యు పరమైన అంశాల ద్వారా భారతీయులు డయాబెటీస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఆసియన్ ఇండియన్ ఫెనోటైప్ సాధారణంగా శరీరభాగాల్లో ఫ్యాట్ చేరడం వల్ల డయాబెటీస్కు దగ్గరవుతున్నారు. డయాబెటీస్ సోకిన వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉండాలి. డైట్ పాటించాల్సి ఉంటుంది. పర్యావరణ పరిస్థితులు కూడా డయాబెటీస్ కు దారితీస్తున్నాయని 2015 జూన్ ఇండియా స్పెండ్ నివేదిక తెలియజేస్తోంది.
డయాబెటీస్ చికిత్స కోసం 34శాతం ఖర్చు
ది అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా 2013 అధ్యయనం ప్రకారం..
పట్టణ ప్రాంతాల్లో ఉండే డయాబెటీస్ రోగులు ప్రతీ చికిత్సకు రూ. 10వేలు ఖర్చు చేస్తుంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు రూ. 6,260 ఖర్చు చేస్తున్నారు. అర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇది చాలా భారంగానే తయారైంది.
ఐడీఎఫ్ అంచనా ప్రకారం.. 2040 వరకు 20-79ఏళ్ల మధ్య వయస్కుల్లో 123మిలియన్ల మంది డయాబెటీస్ వ్యాధి బాధితులుగా మారే అవకాశం ఉంది. టీబీ, హెచ్ఐవీ, మలేరియా కంటే కూడా ఈ వ్యాధి విషయంలో విస్తృత ప్రచారం అవసరమని మిశ్రా తెలిపారు.
నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమమైన నేషనల్ ప్రొగ్రాం ఫర్ ప్రీవెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డిఓవాస్కూలర్ డయాబెటీస్ లాంటి వ్యాధులపై అవగాహన కలిగిస్తోంది. అయితే, ఇది కింది స్థాయి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా చేరాల్సి ఉంది.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications