వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం: ప్రధాని మోడీ విజ్ఞప్తి ఇదే
న్యూఢిల్లీ: భారత దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఓటరు దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సంఘానికి ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓటరుగా నమోదు చేసుకోవాలని, మీ భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని, ఓటు యొక్క శక్తి ఎంతో ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిని స్ఫురణకు తెచ్చేలా ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Comments
English summary
Prime Minister Narendra Modi on Thursday urged the people eligible to vote to register themselves as voters in large numbers to strengthen the Indian democracy.In his message on the National Voters’ Day on Thursday, Modi also congratulated the Election Commission on its anniversary.
Story first published: Thursday, January 25, 2018, 12:45 [IST]