నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం
జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి.
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. పర్యాటక శాఖ నేతృత్వంలో హైదరాబాద్కు చెందిన నెటిజన్ బృందానికి చెందిన 40 మంది ఈ గుహల్లో ఆదివారం పరిశీలించారు.

తాళ్ల సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని సుమారు 20 మీటర్ల లోతుకు దిగారు. ఆదిమానవుల ఆవశేషాల, వారు వాడిన కుండపెంకులు, జంతువులకు సంబంధించిన ఎముకలు లభించాయి. గుహల్లో ఆదిమానవులు నిర్మించుకున్న రాతి గోడలు ఉన్నాయని బృందంలోని సభ్యులైన అరవింద్ ఆర్య, అంకిరెడ్డి, వెంక్గౌడ్ తెలిపారు.
ఈ గుహలను అధ్యయంన చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ క్రిస్టియానా తమను పంపిచారని తెలిపారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గుహలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. తమ అధ్యయనాన్ని పర్యాటక శాఖకు నివేదికగా అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications