టెన్నిస్ ఆడిన చెర్రీ: మురిసిన ఉపాసన (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని మీర్జా టెన్నిస్ అకాడమీలో ఐటిఎఫ్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ తేజ, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ సోమవారంనాడు ఈ టోర్నీని ప్రారంభించారు.
ఐటిఎఫ్ మహిళాల 10000 ప్రైజ్మనీ టెన్నిస్ టోర్నీలో సృష్టి సార్లియా మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలకు హైదరాబాద్ వేదికగా మారుతుండడం అభినందనీయమని రామ్ చరణ్ తేజ అన్నారు.
ఔత్సాహిక టెన్నిస్ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్సించేందుకు సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ అవకాశాలను కల్పిస్తోందని సివి ఆనంద్ అన్నారు.
మీర్జా అకాడమీలో రామ్ చరణ్
మహిళా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో రామ్ చరణ్ తేజతో పాటు సానియా తల్లి నసీమా, పూజ వెంచర్స్ ఫౌండర్ శౌరి రెడ్డి పాల్గొన్నారు.
మీర్జా అకాడమీలో రామచరణ్ తేజ
మీర్జా టెన్నిస్ అకాడమీలో ఐటిఎఫ్ మహిళా టెన్నిస్ టోర్నమెంట్ అకాడమీలో రామ్ చరణ్ తేజ అలా కనిపించారు.
సివి ఆనంద్ కూడా...
మీర్జా టెన్నిస్ అకాడమీలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తదితరులు ఇలా కనిపించారు.
హైదరాబాద్ వేదికగా..
అంతర్జాతీయ టెన్నిస్ టోర్మమెంటులకు హైదరాబాద్ వేదికగా మారతుండడం అభినందనీయమని రామ్ చరణ్ తేజ అన్నారు.
టెన్నిస్ ఆడిన రామ్ చరణ్
రామ్ చరణ్ తేజ అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. దీంతో చెప్పులు లేకుండానే ఆయన టెన్నిస్ ఆడారు.
సివి ఆనంద్తో ఇలా..
ఎండ మండిపోతున్నా సివి ఆనంద్, రామ్ చరణ్ తేజ కొద్ది సేపు మీర్జా టెన్నిస్ ఆకాడమీలో కాసేపు టెన్నిస్ ఆడారు.
తిలకించిన ఉపాసన
సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో రామ్ చరణ్ తేజ టెన్నిస్ ఆడుతుంటే సతీమణి ఉపాసన ఆసక్తిగా తిలకించారు.