విజయవాడలో ‘శివగామి’: మనవడిని కాపాడి కన్నుమూసింది
విజయవాడ: బాహుబలి చిత్రంలో బాహుబలిని రమ్యకృష్ట నీటిలో మునిగిపోతూ కాపాడిన విషయం ఆ సినిమా చూసిన వారందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వలో పడిపోయిన మనుమడిని చేతులతో పైకెత్తి పట్టుకుని కాపాడి తాను నీట మునిగి ఓ వృద్ధురాలు మృతి చెందింది.
శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఉయ్యూరు కొబ్బరితోట ప్రాంతం పుల్లేరు కాల్వకట్టపై చిరిమాల అమ్మణమ్మ(49) నివశిస్తోంది. ఇంటి వెనుక పుల్లేరుకాల్వ ఒడ్డున తన రెండేళ్ళ మనవడు జశ్వంత్ మూత్ర విసర్జన చేస్తూ జారి కాల్వలో పడిపోయాడు. దీనిని గమనించిన అమ్మణమ్మ ఒక్క ఉదుటన కాల్వలో దూకింది.

కాల్వలో నీరు నిండుగా ఉండటంతో మునిగిపోతూ మనుమడిని చేతులపై పైకిలేపి పట్టుకుని ప్రవాహంలో కొట్టుకుపోయింది. బాలుడు నీటిలో తేలి కొట్టుకుపోవడం చూసిన స్థానికులు కాల్వలో దూకి అతడిని కాపాడారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి అమ్మణమ్మ కోసం గాలించి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన మనవడిని కాపాడటం కోసం అమ్మణమ్మ తన ప్రాణం త్యాగం చేసిందని స్థానికులు పేర్కొన్నారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications