విజయవాడలో ‘శివగామి’: మనవడిని కాపాడి కన్నుమూసింది
విజయవాడ: బాహుబలి చిత్రంలో బాహుబలిని రమ్యకృష్ట నీటిలో మునిగిపోతూ కాపాడిన విషయం ఆ సినిమా చూసిన వారందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వలో పడిపోయిన మనుమడిని చేతులతో పైకెత్తి పట్టుకుని కాపాడి తాను నీట మునిగి ఓ వృద్ధురాలు మృతి చెందింది.
శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఉయ్యూరు కొబ్బరితోట ప్రాంతం పుల్లేరు కాల్వకట్టపై చిరిమాల అమ్మణమ్మ(49) నివశిస్తోంది. ఇంటి వెనుక పుల్లేరుకాల్వ ఒడ్డున తన రెండేళ్ళ మనవడు జశ్వంత్ మూత్ర విసర్జన చేస్తూ జారి కాల్వలో పడిపోయాడు. దీనిని గమనించిన అమ్మణమ్మ ఒక్క ఉదుటన కాల్వలో దూకింది.

కాల్వలో నీరు నిండుగా ఉండటంతో మునిగిపోతూ మనుమడిని చేతులపై పైకిలేపి పట్టుకుని ప్రవాహంలో కొట్టుకుపోయింది. బాలుడు నీటిలో తేలి కొట్టుకుపోవడం చూసిన స్థానికులు కాల్వలో దూకి అతడిని కాపాడారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి అమ్మణమ్మ కోసం గాలించి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన మనవడిని కాపాడటం కోసం అమ్మణమ్మ తన ప్రాణం త్యాగం చేసిందని స్థానికులు పేర్కొన్నారు.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..!












Click it and Unblock the Notifications