మైసూర్ యువరాజు యదువీర్ పట్టాభిషేకం(ఫోటోలు)
మైసూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు ప్యాలెస్ లో గురువారం మైసూరు మహారాజుగా యదువీర కృష్టదత్త చామరాజ ఒడయార్ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. గురువారం ఉదయం నుండి పట్టాభిషేకం శుభకార్యానికి శ్రీకారం చుట్టారు. రాణి ప్రమోదదేవికి పాద పూజ చేసిన యదువీర్ తరువాత యువరాజుగా పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నాడు.
మైసూరు ప్యాలెస్ లోని అంబావిలాస్ లోని దర్బార్ హాల్ లో పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. గురువారం ఉదయం 5 గంటల సమయంలో యుదువీర్ కు మంగళస్నానం చేయించి శుభకార్యం మొదలు పెట్టారు. తర్వాత గణపతి పూజ నిర్వహించారు.
ఉదయం 7 గంటల సమయంలో సోమేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టాభిషేకానికి గంగా జలం తీసుకు వెళ్లారు. ఉదయం 9.40 గంటల సమయంలో శుభ కర్ణాటక లగ్నంలో యుదువీర్ ఒడయార్ వెండి సింహాసనం మీద కుర్చున్నారు.
41 సంవత్సరాల తరువాత
1974 వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదిన చామరాజేంద్ర ఒడయార్ మరణించారు. అదే సంవత్సరం అక్టోబర్ 16వ తేదిన శ్రీకంఠదత్త ఒడరాయ్ పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు యదువీర్ పట్టాభిషేకం జరిగింది.
ప్ర్యతేక హోమం
మైసూరు ప్యాలెస్ లో రామతారక హోమం, కలశపూజలు నిర్వహించారు. యదువీర్ 101 కలశ పూజలు చేశారు.
పూజలు
యదువీర్ అరస్ భద్రాసనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖులు హాజరు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, బిజ్రేష్ పటేల్, హెచ్.డి. రేవణ్ణ, కేపీపీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మంత్రులు డి.కే. శివకుమార్, రోషన్ బేగ్, శ్రీనివాస్ ప్రసాద్, ఆర్.వి. దేశ్ పాండే తదితరులు పట్టాభిషేక కార్యక్రమనికి హాజరైనారు.
బంగారు బాసింగం
యదువీర్ ఒడయార్ కు బంగారు బాసింగ కట్టారు. తరువాత యుదువీర్ దగ్గర ప్రత్యేక పూజలు చేయించారు.
వేదమంత్రాలు
మైసూరు మహారాజుల ఆస్థాన వేదపండితుల వేదమంత్రాల నడుమ పట్టాభిషేకం కార్యక్రమం మొదలయ్యింది.
పట్టాభిషేకం
యదువంశ 27వ అరస్ గా యదువీర ఒడయార్ కు సామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. 16 దేవాలయాల నుండి తీసుకు వచ్చిన ప్రసాదాన్ని యుదువీర్ కు అందించారు.
కాబోయే భార్యా, కుటుంబ సభ్యులు
పట్టాభిషేకం కార్యాక్రమానికి యదువీర్ కృష్టదత్త చామరాజ ఒడయార్ కు కాబోయే భార్య త్రిశికా కుమారి (కుడి వైపు), ఆమె కుటుంబ సభ్యులు హాజరైనారు.
రాజదర్బార్
పట్టాభిషేకం తరువాత సింహాసనం మీద యదువీర్ కృష్టదత్త చామరాజ ఒడయార్ ఇలా దర్శనం ఇచ్చారు.