చిరు పార్టీతో సిపిఐ?
ఎన్నికల సమయంలోనే సోదర కమ్యూనిస్టు పార్టీ సిపిఎంతో తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. మంగళగిరి సీటు విషయంలోనే కాకుండా వరంగల్ జిల్లాలో సిపిఎం వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తీవ్రంగా మండిపడ్డారు. సిపిఎం, సిపిఐల మధ్య నెలకొన్న విభేదాల వల్ల రెండు పార్టీలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఈ స్థితిలో ప్రజారాజ్యం పార్టీతో భవిష్యత్తులో వెళ్లాలనే ఆలోచనకు సిపిఐ నాయకత్వం వచ్చింది. సిపిఎం మాత్రం తెలుగుదేశంతోనే కొనసాగే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. సమస్యలపై పోరాటంలో ప్రజారాజ్యం పార్టీ కలిసి వస్తే ఆహ్వానిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. కానీ ప్రజారాజ్యం పార్టీతో అది పొత్తు పెట్టుకునే అవకాశాలు తక్కువే. చంద్రబాబు ఉండగానే చిరంజీవి పొత్తుకు రావాలనేది రాఘవులు అభిమతం. అయితే చంద్రబాబుతో దోస్తీ కట్టడానికి చిరంజీవి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టుల దారులు వేరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.