వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెబెల్సే 'మహా' కింగ్ మేకర్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

kingmakers
ముంబై: మహారాష్ట్ర శాసనసభకు మంగళవారం ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ప్రచార పర్వం ముగియడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు వోట్ల కోసం తెరచాటు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో రెండు ఎన్నికల్లో మాత్రమే ఇప్పటి కన్నా ఎక్కువ మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్రులే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 1990లో 2,286 మంది, 1995లో 3,196 మంది స్వతంత్రులు రంగంలో ఉన్నారు. ఈసారి 1,820 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు.

మహారాష్ట్రలో 1995లో త్రిశంకు శాసనసభ ఏర్పడింది. రికార్డు స్థాయిలో 45 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడిది. ఈ కారణంగా స్వతంత్రుల మద్దతుతో శివసేన - బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం పోటీ చేస్తున్న స్వతంత్రుల్లో 117 మంది ఫలితాలను తారుమారు చేసే శక్తి మాత్రమే కాదు, తాము గెలగలిగే సత్తా ఉన్నవారు. వీరు రాజకీయ పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు కావడం విశేషం. వీరిలో 81 మంది కాంగ్రెసు - ఎన్సీపి తిరుగుబాటు అభ్యర్థులు కాగా 27 మది శివసేన - బిజెపి కూటమికి చెందినవారు. మరో 9 మంది ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారు.

ఎన్సీపికి తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అత్యధికంగా 60 మంది ఎన్సీపి తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించడానికి ఎన్సీపి వారం రోజులు తీసుకుంది. అది కూడా కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే. వివిధ పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు ఫలితాల వెల్లడి తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X