ఎన్టీఆర్ దేవుడా?

NT Ramarao
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును దేవుడిని చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ ను రాజకీయ నాయకులకు అతీతంగా నిలబెట్టి దేవుడ్ని చేసి మొక్కులు చెల్లించే స్థాయికి చేరుస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను చూసినా, నిరంతరం ఆయనను పేరును వల్లించే ప్రయత్నం చూసినా మనకు ఆ విషయం తేటతెల్లమవుతుంది. ఊరూరా ఆయన విగ్రహాలను నెలకొల్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంధి కాలంలో ఆయన అడుగు పెట్టారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం నినాదాలతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టి కాంగ్రెసు పార్టీకి సవాల్ గా నిలిచారు. కాంగ్రెసు పార్టీకి ఎదురే లేని సందర్భంలో, కాంగ్రెసు పార్టీ ఆడింది ఆటగా సాగుతున్న కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఢిల్లీలో జరుగుతున్న అవమానాలను ఆయన ప్రధాన విమర్శనాస్త్రంగా ఎంచుకున్నారు. వామపక్షాలు చేష్టలుడిగిన కాలంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం కనిపించడంతో ఆయనను రాష్ట్ర ప్రజలు ఆదరించారు.

సినిమాల విషయానికి వస్తే, పౌరాణిక పాత్రల పోషణలో ఆయనకు సాటి వచ్చేవారు తక్కువ. ఎస్వీ రంగారావు వంటి ఒకరిద్దరు కనిపించినా ఎన్టీ రామారావు మాదిరిగా వెలిగినవారు లేరు. శ్రీకృష్ణుడంటే ఇలాగే ఉండేవాడు అనిపించేలా ఆ పాత్రకు రూపు కట్టారు. దాంతో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీ రామారావును తెలుగు ప్రజలు పూజించారు కూడా. గుడులు కూడా కట్టిన సందర్భాలున్నాయి. ఆయనకు విశేష జనాదరణ ఉంది. ఆ జనాదరణ మాత్రమే ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో విజయం సాధించలేదు. అప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న ఒక ఖాళీ ఆయనను ముందుకు నడిపించింది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలోని కొత్త తరానికి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం లభించింది. పలుకుబడి, అంగ, అర్థ బలాలు లేని ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రధాన నాయకులుగా ఉన్న చాలా మంది ఎన్టీ రామారావు ద్వారా రాజకీయాల్లోకి వచ్చినవారే. అలాగే, ప్రజా సంక్షేమం కోసం ఆయన పలు పథకాలను ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అందరికీ తెలిసిందే. బిసిలు, ఎస్సీలు, ఎస్టీలకు పలు పథకాలను కూడా ఆయన అమలు చేశారు. ఈ విషయానికి వస్తే చాలా మంది రాజకీయ నాయకుల కన్నా ఎన్టీ రామారావు ఏదో మేరకు ప్రజల మేలు గురించి ఆలోచన ఎక్కువగా చేసినవారే.

కాగా, ఎన్టీ రామారావు ఆయన కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినవారు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజలందరికీ చెందినవారు. ఎన్టీ రామారావు ఆశయాలకు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఏనాడో చెల్లు చీటి పాడింది. అందువల్ల ఎన్టీ రామారావు వారసత్వాన్ని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి గానీ కుటుంబ సభ్యులకు గానీ లేదు. రాజకీయాల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఆయకు స్పష్టమైన అభిప్రాయాలు కూడా ఉండేవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+