జగన్ వెంట మిగిలేదెవరు?

YS Jagan
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భవిష్యత్తు దాదాపుగా ఖరారైంది. పార్టీ అధిష్టానం ఆయనను పిలిచి బొట్టు పెట్టే పరిస్థితి లేదు. ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. తన డిమాండ్లకు అంగీకరిస్తే తప్ప సయోధ్య కుదరదని జగన్ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోవడానికే జగన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే శుక్రవారం తన అనుచరులతో చర్చలు జరిపారు. వైయస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన జరిపే సంస్మరణ సభ పోస్టరును ఆయన విడుదల చేశారు. పార్టీతో గానీ ప్రభుత్వంతో గానీ సంబంధం లేకుండా ఆయన దాన్ని సొంత కార్యక్రమంగానే తీసుకుంటున్నారు. ఈ సంస్మరణ సభలోనే ఆయన సొంత పార్టీ పెట్టవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో ఆయన వెంట వెళ్లేవారు ఎవరనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

శుక్రవారం జగన్ ను కలిసినవారిలో ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, శాసనసభ్యురాలు కొండా సురేఖ, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ముఖ్యమైన వారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జగన్ తో భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ తేదీన జగన్ ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఆయనకు మొదట వీర అనుచరుడిగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర జరుగుతుందనే సమాచారం తనకు లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే చిరంజీవి మద్దతు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. జగన్ ను పార్టీ నుంచి పంపే కుట్ర జరుగుతోందని విమర్సలను ఆయన ఖండించారు. దీన్ని బట్టి ఇటీవల నెల్లూరు పర్యటనలో ఆనం వివేకానంద రెడ్డికి చిరంజీవికి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని పసిగట్ట వచ్చు. ఆ రకంగా చిరంజీవి కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతూ జగన్ దూరమవుతున్నారని అనుకోవాలి.

ఆనం వివేకానంద రెడ్డి లాగానే పలువురు శాసనసభ్యులు కూడా జగన్ కు దూరం కావచ్చు. శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వంటి కొంత మంది జూనియర్ శాసనసభ్యులు మాత్రమే జగన్ వెంట ఉంటారనే ప్రచారం సాగుతోంది. పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి కూడా జగన్ కు మద్దతిస్తున్నారు. అయితే డ్రామా క్లైమాక్స్ కు చేరే సరికి ఆమె కూడా ఉంటారో, ఉండరో తెలియదు. జగన్ కు మద్దతుగా నిలుస్తున్న సబ్బం హరి వైఖరి అర్థం కాకుండా ఉంది. రాష్టానికి చెందిన మిగతా పార్లమెంటు సభ్యులంతా జగన్ కు దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒక్కరు కూడా ఆయన వెంట ఉండే అవకాశం లేదు. మొదట ఉన్న జగన్ కు ఉన్న హైప్ ఇప్పుడు లేదు. బహుశా, జగన్ తనకు ప్రజా బలం ఉందని భావిస్తూ ఉండవచ్చు. ఏమైనా, ఆయన భవిష్యత్తును తిరుపతి సభనే నిర్ణయిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+