Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ 'సాక్షి' వ్యూహం?

YS Jagan
వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై సాక్షి దినపత్రిక అనుమానాలు వ్యక్తం చేస్తూ భారీ వార్తాకథనాన్ని మళ్లీ ఎందుకు ప్రచురించిందనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ వార్తాకథనం వెనక దాగి ఉన్న కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహమేమిటనే ఆలోచన రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. జగన్ చెప్పకుండా సాక్షి దినపత్రికలో ఆ వార్తాకథనం ప్రచురితం కాదనే విషయం అందరికీ తెలిసిందే. సిబిఐతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల తీరును తప్పు పడుతూ సాక్షి దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్ ప్రథమ వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో ఈ వార్తాకథనం ప్రచురితమైంది. పైగా, ఇంకా వారం రోజుల గడువు ఉండగానే దాన్ని ప్రచురించడం ద్వారా సెప్టెంబర్ 2వ తేదీ వరకు సాక్షి దినపత్రిక అనుసరించబోయే తీరుపై కూడా ఆసక్తి రేకెత్తుతోంది.

పక్కా వ్యూహం ప్రకారమే సాక్షిలో జగన్ ఆ వార్తాకథనాన్ని ప్రచురింపజేశారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో వైయస్ జగన్ ప్రథమ వర్ధంతి సభను జరుపుతోంది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఆ రోజు వైయస్ వర్ధంతి కార్యక్రమాలను తలపెట్టారు. ఒక రకంగా జగన్ వర్గం తలపెట్టిన సంస్మరణ సభకు ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ విరుగుడుగా కార్యక్రమాలు చేపట్టిందని భావించవచ్చు. వైయస్ పార్టీకి చెందిన వాడని, పార్టీ లేకుండా వైయస్ ఎదుగుదల లేదని చెప్పడానికి కాంగ్రెసు నాయకత్వం ప్రయత్నిస్తుండగా, పార్టీకి దక్కకుండా తాను మాత్రమే సొంతం చేసుకోవడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన వల్లనే జగన్ వైయస్సార్ ను కాంగ్రెసుకు కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇందులో భాగంగానే సాక్షి దినపత్రికలో ఆ వార్తాకథనం మళ్లీ వచ్చిందని భావిస్తున్నారు.

వైయస్సార్ మరణానికి కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనక తమ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వ పెద్దలే ఉన్నారని చెప్పడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నట్లు ఆ వార్తాకథనాన్ని అర్థం చేసుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు కూడా ప్రభుత్వం చెప్పుచేతల్లోనే పనిచేస్తాయని, అందువల్లనే దర్యాప్తు సరిగా జరగలేదని చెప్పడానికి ప్రయత్నించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఓదార్పు యాత్రలో కాంగ్రెసు పార్టీ ప్రస్తావన గానీ సోనియా ప్రస్తావన గానీ తేకపోవడం వెనక గల కారణాన్ని అటుంచితే, వైయస్ మరణంపై జరిగిన దర్యాప్తు తీరును తప్పు పట్టడం సోనియా, మన్మోహన్ ల నాయకత్వంలోని పార్టీ, ప్రభుత్వం ఉన్నాయని జగన్ నిందించడానికి సిద్ధపడ్డారని భావించాల్సి ఉంటుంది. ఇలా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, పార్టీ అధిష్టానాన్ని తప్పు పడుతూ ముందుకు వెళ్లడం జగన్ వ్యూహంలో భాగమని, అది సొంత పార్టీ పెట్టే దిశగానే ఉందని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+