సర్వే: జగన్ది పవర్, కెసిఆర్ది ప్రతిపక్షం
ప్రభుత్వం ఇప్పుడు పడిపోయి ఎన్నికలు వస్తే జగన్ పార్టీ 139-156, టీఆర్ఎస్ 70-74, కాంగ్రెస్ 28-33, టిడిపి 22-37, కమ్యూనిస్టులు 1-2, ఇతరులు 3-6 వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. ఇక ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్కు 12-14, కోస్తాంధ్రలో 12-14, రాయలసీమలో 3-5, తెలంగాణలో టిడిపికి 15-17, కోస్తాంధ్రలో 14-16, రాయలసీమలో 3-5, ఇక టిఆర్ఎస్కు తెలంగాణలో 70-74, పీఆర్పీకి తెలంగాణలో, రాయలసీమలో ఏమీ రాకున్నాకోస్తాంధ్రలో 2-4 సీట్లు, జగన్ పార్టీ కోస్తాంధ్రలో 87-94, తెలంగాణలో 12-14, రాయలసీమలో 41-45 గెలుస్తారని సర్వేలో తేలింది. ఓట్ల శాతానికి వస్తే కాంగ్రెస్కు 16, టిడిపికి 18, టిఆర్ఎస్కు 20, పీఆర్పీకి 5, జగన్కు 35 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. పార్టీ అధినేతల వ్యక్తిగత ఇమేజ్ చూస్తే.. టిడిపి అధినేత చంద్రబాబుకు ఈమేజ్ పెరిగిందని 27శాతం మంది అభిప్రాయపడితే, 40 మంది అలాగే ఉందని, 32 శాతం మంది పెరగలేదని చెప్పారు.
చిరు ఇమేజ్ పెరిగిందని 6, అలాగే ఉందని 40, పెరగలేదని 52శాతం, కెసిఆర్ ఇమేజ్ పెరిగిందని 40, అలాగే ఉందని 21, పెరగలేదని 29శాతం మంది, జగన్ ఇమేజ్ పెరిగిందని 61, అలాగే ఉందని 24, పెరగలేదని 11శాతం, సోనియా, రాహుల్ ఇమేజ్ పెరిగిందని 7శాతం మంది సర్వేలో చెప్పారు. ఇక 2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నరనే దానికి 35శాతం మంది జగన్, 19శాతం చంద్రబాబు, 18శాతం కేసిఆర్, 15శాతం కిరణ్కుమార్ రెడ్డి, 5శాతం చిరంజీవిని కోరుకుంటున్నారు. ప్రాంతాల వారిగా చెప్పాలంటే రాయలసీమలో జగన్ను 66శాతం, తెలంగాణలో 12శాతం, ఆంధ్రలో 48శాతం సిఎంగా కోరుకుంటున్నారు. చంద్రబాబును సీమలో 20, తెలంగాణలో 14, ఆంధ్రలో 23, కిరణ్ను సీమలో 9, తెలంగాణలో 16, ఆంధ్రలో 17, చిరును సీమలో 4, తెలంగాణలో 1, ఆంధ్రలో 11శాతం కాగా, ఇక కెసిఆర్ను తెలంగాణలో 43శాతం మంది సిఎంగా కోరుకుంటున్నారు.
కిరణ్ ప్రభుత్వం పనితీరు విషయానికి వస్తే కాంగ్రెస్ బాగానే పని చేస్తుందని 11, ఫరవాలేదని 21, బాగాలేదని 71, ప్రతిపక్షంగా టిడిపి బాగానే ఉందని 16, ఫరవాలేదని 19, బాగాలేదని 64, పీఆర్పీ బాగుందని 5, ఫరవాలేదని 11, బాగాలేదని 83శాతం మంది తేల్చి చెప్పారు. ఇక ప్రభుత్వం నిలబడుతుందా, పడిపోతుందా అంటే 52శాతం మంది పడిపోతుందని, 30శాతం మంది లేదని, 18శాతం మంది చెప్పలేమన్నారు. కాగా రోశయ్య ప్రభుత్వం ఉన్న 2010లో 71శాతం మంది ప్రభుత్వ ఉంటుందని భావించగా ఇప్పుడు మాత్రం 30 మందికి పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని 80శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ ఇంతగా బలహీన పడటానికి కారణం జగన్ బయటకు వెళ్లిపోవడమే అని 34శాతం మంది, బలమైన నాయకుడు లేకపోవడమే అని 32శాతం మంది, నేతల తీరు అని 10శాతం, సోనియాగాంధీ వ్యవహార శైలి అని 8శాతం మంది సర్వేలో తేల్చి చెప్పారు.