గద్దర్ను మావోయిస్టులు సస్పెండ్ చేశారా?

ప్రజాతంత్ర రాజకీయ శక్తి కావాలని ఇటీవల గద్దర్ ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. గద్దర్ వ్యాఖ్యలు విప్లవోద్యమంలో అయోమయానికి కారణమవుతున్నాయని, దాంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపిందని ఓ పోలీసు అధికారి తమతో చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. గద్దర్కు వ్యతిరేకంగా మావోయిస్టు మేధావులు, సానుభూతిపరులు పార్టీకి లేఖలు రాసినట్లు ఆ పత్రిక తన వార్తాకథనంలో తెలిపింది.
తనకు ఏ విధమైన సమాచారం లేదని, సమాచారం అందిన తర్వాత మాట్లాడుతానని, సమస్య తనకూ ప్రజలకూ పార్టీకీ మధ్య మాత్రమేనని గద్దర్ తమతో అన్నట్లు ఆ పత్రిక రాసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఉద్యమం కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని ఆయన అన్నట్లు పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications