Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దీదీ తెలంగాణ ప్లాన్ ఏమిటి?

Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణపై మరో చర్చకు దారి వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ఉంటుంద ని, గూర్ఖాల్యాండ్‌ను స్విట్జర్లాండ్ మాదిరిగా చేస్తామని హామీ ఇచ్చామ ని ఆమె చెప్పారు. ఈ ప్రకటన ద్వారా ఆమె తెలంగాణపై అయోమయాన్ని సృష్టించారు. అసలు తెలంగాణపై దీదీ ప్రతిపాదన ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు స్విట్జర్లాండ్ తరహా స్వయంప్రతిపత్తి కల్పిస్తే సరిపోతుందనేది ఆమె భావనగా చెప్పవచ్చు. గూర్ఖాల్యాండ్ తరహాలో తెలంగాణకు స్వయంప్రతిపత్తి కల్పించి, ప్యాకేజీలు ప్రకటించాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. డార్జిలింగ్‌కు స్విట్జర్లాండ్ తరహా స్వయంప్రతిపత్తి కల్పిస్తామని తాము ఇచ్చిన హామీకి గూర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా అంగీకరించినట్లు కూడా ఆమె మంగళవారంనాటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు.

స్విట్జర్లాండ్‌ను కాంటోన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలుగా విభజించారు. కాంటోన్ అనేది కార్నర్ లేదా డిస్ట్రిక్ట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది. దాని నుంచే కంటోన్మెంట్ అనే పదం కూడా వచ్చింది. అది ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ జోన్. ప్రాంతాన్ని బట్టి, జనాభాను బట్టి ఇది చాలా చిన్నది. స్విట్జర్లాండ్ మాత్రమే కాకుండా బెల్జియం, బెల్జియం, బొలీవియా, బోస్నియా, కెనడా, కోస్టా రికా, ఇక్విడార్, ఎల్ సాల్విడార్, లెబనాన్, లక్సెంబర్గ్‌ల్లో కూడా కాంటోన్‌లున్నాయి. స్విస్ కాంటోన్స్ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ ఐరోపా దేశంలోని ప్రతి కాంటోన్ తనదైన రాజ్యాంగాన్ని, చట్టసభను, ప్రభుత్వాన్ని, కోర్టులను కలిగి ఉంటుంది. ఆరోగ్య సేవలు, సంక్షేమం, చట్టాల అమలు, ప్రబుత్వ విద్యలతో పాటు పన్నుల విధానం కూడా కాంటో‌న్‌ల ఆధీనంలో ఉంటాయి.

గూర్ఖాల్యాండ్‌లో స్థానిక చట్టాలకు, అధికార భాషగా గూర్ఖాకు, ఆర్థిక ప్యాకేజీకి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. గూర్ఖాల్యాండ్ కౌన్సిల్ ఆ ప్రాంతాన్ని పాలిస్తుంది. ప్రజాస్వామబద్దమైన ఎన్నికల ద్వారా ప్రజలు కౌన్సిల్‌ను ఎన్నుకుంటారు. అయితే, దానికి చట్టాలను సవరించే అధికారం ఉండదు. అయితే,తెలంగాణవాదులు ఇటువంటి స్వయంప్రతిపత్తి, ప్యాకేజీలకు అంగీకరించలేదని స్పష్టంగానే చెబుతున్నారు. గత హామీలు, చట్టపరమైన గ్యారంటీలు ఏవీ అమలు కాకపోవడంతో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేమీ అక్కర్లేదని, రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. ప్రస్తుత స్థితిని కొనసాగిస్తూ తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసి, ఆర్థిక, చట్టపరమైన అధికారాలు ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరవ సూచన. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పునరుద్ధరించిన ప్రాంతీయ మండళ్లు పని చేయడం మానేశాయి. అందువల్ల మమతా బెనర్జీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ఉంటుందనే మాటకు పస లేదని అర్థమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+