వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వద్దన్నాక బాబు మంతనాలేమిటి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలంగాణ తెలుగుదేశం ప్రత్యేక శాఖకు పట్టుబడుతున్న నాగం జనార్ధన్‌ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులతో గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి అసలు ప్రాధాన్యతే లేక పోవటం అసలు విషయం. ఏదో భేటీ అవుతామని చెప్పాం కాబట్టి కావల్సింది అన్న తరహాలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే నాగం పట్టుపడుతున్న తెలంగాణ టిడిపి ప్రత్యేకశాఖపై అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఏకంగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి విలేకరుల సమావేశంలోనే తెలంగాణ ప్రత్యేక శాఖ లేదని అది సమసిపోయిన అంశమని దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.

9వ తేదిన తెలంగాణ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశానికి ముందు అధినేత అనుమతి లేకుండానే నాగం తన ఇంటిలో అదే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అందరు కలిసి చంద్రబాబు ముందు తెలంగాణ టిడిపి ప్రత్యేక శాఖకు పట్టుబట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అవసరమైతే ఒత్తిడి తీసుకు రావడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే బాబు వారిని పిలిచి చీవాట్లు పెట్టడం, తెలంగాణ శాఖపై తన పర్యటన తర్వాత మాట్లాడుతానని చెప్పడం జరిగిపోయింది.

అయితే వారికి చీవాట్లు పెట్టినప్పుడు ప్రత్యేక శాఖ లేదని అవసరమైతే సమన్వయ శాఖ ఏర్పర్చుకొని అందరు కలిసి పోరాడాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయినా నాగం అండ్ కం. ప్రత్యేక శాఖ కోసం బాబు వచ్చిన తర్వాత అడుగుతామని దానికి ఆయనను ఒప్పిస్తామని చెప్పారు. దీంతో ప్రత్యేక శాఖపై ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు మళ్లీ ఆశలు పెంచుకున్నారు. అయితే రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలోనే స్పష్టంగా చెప్పటంతో ప్రత్యేక శాఖ అనేది లేదని తెలిపోయింది. ఇలాంటప్పుడు కేవలం ప్రత్యేక శాఖ కోసమే ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అర్థం లేకుండా పోయింది. ఇప్పటికే శాఖ లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పాక మళ్లీ అదే విషయంపై సమావేశమనేది అర్థరహితమే. అయితే ఈ సమావేశంలో సమన్వయ కమిటీపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X