ప్రధానితో భేటీ వార్తలపై ఇరకాటంలో పడిన జగన్

YS Jagan
ఢిల్లీ యాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనాల వల్ల సంభవించిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయన వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జగన్‌కు దక్కని ఓదార్పు అంటూ ఓ ప్రముఖ దినపత్రిక రాసిన వార్తాకథనాన్ని జగన్ వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జగన్‌కు క్లాస్ తీసుకున్నట్లు, సిబిఐ దర్యాప్తు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నట్లు వచ్చిన వార్తలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.

ప్రధాని ఎదురొచ్చి వైయస్ జగన్‌ను ఆహ్వానించారని మేకపాటి రాజమోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరు జిల్లాలో ఓ సభలో అన్నారు. జాతీయ నాయకుల నుంచి జగన్‌కు సాదర ఆహ్వానం లభించిందని, తాను దగ్గరుండి చూశానని ఆయన చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తలువు వద్దకు వచ్చి మరీ జగన్‌ను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. ప్రధాని జగన్‌తో అర నిమిషం మాత్రమే మాట్లాడారని వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. ప్రధాని జగన్‌తో 11 నిమిషాలు మాట్లాడారని ఆయన చెప్పారు.

ఢిల్లీ యాత్రపై వచ్చిన వార్తలతో వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. బిజెపి నేత సుష్మా స్వరాజ్ జగన్‌కు బిజీగా ఉన్నానంటూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కేంద్ర మంత్రులు శరద్ పవార్‌ను జగన్ వ్యవసాయం పేరు చెప్పి కలిశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన కలిశారు. అయితే, జగన్‌కు అంత మద్దతు లభించలేదనే చెప్పాలి. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న మీడియా దాంతో పండుగ చేసుకుంది. దాని వల్ల జరిగిన నష్టాన్ని నివారించడంపై వైయస్ జగన్ వర్గం ఇప్పుడు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మీడియా వార్తలపై వైయస్ జగన్ ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+