జగన్కు చెమటలు పట్టిస్తున్న వివేకా

కడప జిల్లాలో మొత్తం 622 మంది ఎంపిటిసీ, జడ్పీటిసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెసుకు 498 మంది, తెలుగుదేశం పార్టీకి 122 మంది ఉన్నారు. తమ అభ్యర్థికి కనీసం 270 ఓట్లు వస్తాయని జగన్ వర్గం విశ్వసిస్తోంది. గెలుపు కోసం వైయస్ జగన్ వర్గం కూడా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ స్థితిలోనే ఎంపిటీసలు, జడ్పీటిసీల కిడ్నాప్ వివాదాలు ముందుకు వచ్చాయి. అయితే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ఓట్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ వివేకానంద రెడ్డి పావులు కదిపారు. వివేకానంద రెడ్డితో పాటు మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ వర్గం అభ్యర్థిని ఓడించేందుకు వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు.
కాంగ్రెసు అభ్యర్థిని గెలిపిస్తేనే వైయస్సార్ పథకాలు సక్రమంగా అమలవుతాయని వైయస్ వివేకానంద రెడ్డి నచ్చజెబుతున్నారు. కడప జిల్లాలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అయితే, వివేకానంద రెడ్డిని ఎదుర్కోవడానికి వైయస్ జగన్ వర్గం కూడా తీవ్రంగానే కృషి చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం పులివెందుల శాసనసభకు, కడప పార్లమెంటుకు జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. జగన్ వర్గం అభ్యర్థిని ఓడిస్తే ఆ ఎన్నికల్లో వైయస్ జగన్పై నైతిక విజయం సాధించినట్లు కూడా అవుతుందని కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications